ఆగస్టు 25 అనగానే ఐదేళ్ల ముందు వరకు విజయ్ దేవరకొండ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేసేవి. 2017లో అదే రోజు అర్జున్ రెడ్డి అనే కల్ట్ బ్లాక్బస్టర్ మూవీ రిలీజై పెను సంచలనం రేపింది. ఓ కొత్త దర్శకుడు, అప్ కమింగ్ హీరో కలిసి చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన వసూళ్లు.. ఇతర భాషల ప్రేక్షకుల నుంచి కూడా తెచ్చుకున్న స్పందన అసామాన్యం.
అప్పటికి అలా ప్రకంపనలు రేపడమే కాక.. తర్వాత కూడా తెలుగు సినిమాను ఎంతగానో ప్రభావం చేసిన చిత్రమిది. 2017 తర్వాత ప్రతి ఏడాదీ ఆగస్టు 25 వస్తే విజయ్తో పాటు తన అభిమానులు ఆ తేదీని బాగా సెలబ్రేట్ చేసేవాళ్లు. ఆ సినిమా జ్ఞాపకాలత మైమరిచిపోయేవారు.
కానీ 2022 ఆగస్టు 25 మాత్రం వాళ్లకు పీడకలను మిగిల్చింది. అర్జున్ రెడ్డి డేట్కే ఇంకో బ్లాక్బస్టర్ కొట్టాలని ఆ ఏడాది విజయ్ చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అతను చేసిన లైగర్ భారీ డిజాస్టర్గా మిగిలింది. అర్జున్ రెడ్డి అమితానందాన్నిచ్చిన అదే రోజు విజయ్కే మరపురాని చేదు జ్ఞాపకాన్నిచ్చింది లైగర్.
గత ఏడాది, ఇప్పుడు ఆగస్టు 25 అంటే అర్జున్ రెడ్డి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కంటే లైగర్ తాలూకు జ్ఞాపకాలతో బాధ పడడమే ఎక్కువగా కనిపిస్తోంది విజయ్ అభిమానుల్లో. ఆదివారం నాడు విజయ్ అర్జున్ రెడ్డి ఏడో వార్షికోత్సవం నేపథ్యంలో ఒక పోస్ట్ పెట్టాడు. అర్జున్ రెడ్డి డైరెక్టర్స్ కట్ (అన్ ఎడిటెడ్)ను పదో వార్షికోత్సవం నాడు అభిమానుల కోసం రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డిని కోరాడు. ఈ పోస్ట్ బాగానే వైరల్ అయింది కానీ.. మరోవైపు లైగర్ సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. అర్జున్ రెడ్డి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోలేని విధంగా లైగర్ చేదు అనుభవాన్ని మిగిల్చిందంటూ.. ఆ రోజు తాము ఎదుర్కొన్న వేదనను విజయ్ అభిమానులు పంచుకుంటున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ లైగర్ రెండో వార్షికోత్సవం సందర్భంగా పోస్ట్ పెడితే కింద కామెంట్లన్నీ బూతులతో నిండిపోయాయి. ఇక ఎప్పటికీ అర్జున్ రెడ్డి వార్షికోత్సవాన్ని మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేయలేని విధంగా లైగర్ చేసిందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on August 26, 2024 1:21 am
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…