చిరంజీవి, బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ పరంగా ఎలాంటి పోటీ ఉన్నప్పటికీ ఇద్దరికి మంచి స్నేహం ఉందన్న విషయం ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసు. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్లలో ఖైదీ నెంబర్ 150 పోటీ గురించి మాట్లాడుతూ తనకు పరిశ్రమలో ఉన్న ఫ్రెండ్స్ లో చిరు ముందు వరసలో ఉంటారని, ఆయనతో చాలా విషయాలు షేర్ చేసుకుంటానని బాలయ్య అన్నారు. లాంచ్ ఈవెంట్ కు మెగాస్టార్ గెస్టుగా వచ్చారు. అయితే సంక్రాంతికి జరిగే వీళిద్దరి క్లాష్ జరిగితే అభిమానులలో విపరీతమైన ఎగ్జైట్ మెంట్ వచ్చేస్తుంది. ఎవరిది పై చేయి అవుతుందనే దాని మీద రకరకాల డిబేట్లు పెట్టుకుంటారు.
మరోసారి ఈ యుద్ధాన్ని చూసే అవకాశం దక్కబోతోంది. విశ్వంభర జనవరి 10 విడుదల చేయబోతున్నట్టు యువి సంస్థ షూటింగ్ మొదలైన టైంలోనే చెప్పేసింది. దానికి అనుగుణంగానే వేగంగా చిత్రీకరణ చేసి చివరి దశకు వచ్చేశారు. వాయిదా పడే ఛాన్స్ ఒక్క శాతం కూడా లేదని మెగా వర్గాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. దర్శకుడు వశిష్ట మేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఊరిస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో సితార సంస్థ రూపొందిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ఎన్బికె 109 సైతం జనవరి రేసులోనే పాల్గొనబోతోంది. గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఇద్దరూ తలపడి హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే.
గతంలో ఎన్నోసార్లు ఈ పోటీ జరిగింది కానీ ప్రజారాజ్యం కోసం బ్రేక్ తీసుకుని తిరిగి చిరంజీవి కంబ్యాక్ ఇచ్చాక బాలయ్యతో పోటీ పడింది రెండు సార్లే. ఇద్దరూ గెలిచారు.ఇప్పుడు మూడోసారి రిపీట్ కావాలన్నది ఫ్యాన్స్ కోరిక. అయితే సంక్రాంతి వేడి ఇక్కడితో అయిపోలేదు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పండగకే రెడీ అవుతోంది. రవితేజ, భాను బోగవరపు కలయిక వచ్చే చిత్రం పోటీకి సై అంటోంది. ఇది ఎన్బికె 109 నిర్మిస్తున్న సితార బ్యానర్ దే కావడం ట్విస్టు. నాగార్జున బరిలో లేరు కానీ ఒకవేళ కుబేర ఆలస్యమైన పక్షంలో తన సెంటిమెంట్ ఫాలో అయితే ఇది కూడా పందెంలో ఉంటుంది. చూద్దాం.
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…