ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన లక్కీ భాస్కర్ మరోసారి కొత్త డేట్ వెతుక్కుంది. తొలుత ప్రకటించిన సెప్టెంబర్ కాకుండా ఏకంగా నెలన్నర ఆలస్యంగా అక్టోబర్ 31 విడుదల చేయబోతున్నట్టు సితార సంస్థ అధికారికంగా ప్రకటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మనీ క్రైమ్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్. ధనుష్ తో సార్ రూపంలో బ్లాక్ బస్టర్ సాధించాక తిరిగి అదే దర్శకుడితో నిర్మాత నాగవంశీ ప్రాజెక్టు లాక్ చేసుకున్నారు. టాలీవుడ్ లో బలమైన ముద్ర వేయాలని చూస్తున్న దుల్కర్ సల్మాన్ దీన్నో మంచి అవకాశంగా భావించి అనుకున్న దానికన్నా ఎక్కువ డేట్లే ఇచ్చారట.
దీని సంగతలా ఉంచితే అక్టోబర్ 31 వస్తున్నట్టు గతంలోనే విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ప్రకటించింది. ఆ మధ్య ప్రమోషన్లు మొదలుపెట్టి ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తన కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ అవుతుందని, స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంటుందని విశ్వక్ ఊరించడం అభిమానుల్లో అంచనాలు పెంచింది. మంచి డేట్ కావడంతో ఓపెనింగ్స్ తో పాటు రన్ దక్కుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్ రావడం వల్ల పోటీ అనివార్యమైపోయింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ముందు ముందు ఏదైనా ప్యాన్ ఇండియా మూవీ వచ్చినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కాంపిటీషన్ తప్పడం లేదు కానీ సోలో డేట్ల కోసం ప్రయత్నిస్తున్న హీరోలకు అది సాధ్యపడటం లేదు. విశ్వక్ సేన్ కు ముందైతే అడ్డు లేదు. కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్ తో పాటు కార్తీ అరవింద్ స్వామిల సినిమాతోనూ తలపడాల్సి ఉంటుంది. అన్నీ మల్టీ లాంగ్వేజ్ చిత్రాలు కావడం వల్ల థియేటర్ల పంపకాల్లో రాజీ ఉంటుంది. కింగ్ అఫ్ కోత తర్వాత దుల్కర్ సల్మాన్ కు బాగా గ్యాప్ వచ్చింది. మలయాళం దర్శకులకు కమిట్ మెంట్స్ ఇవ్వడం లేదు. ఒప్పుకున్నవి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇదంతా లక్కీ భాస్కర్ మీద బలమైన నమ్మకం వల్లేనేమో.
This post was last modified on August 20, 2024 7:39 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…