హిందీ బెల్టులోనూ భారీ రికార్డులను సాధించిన కల్కి 2898 ఏడిని లక్ష్యంగా పెట్టుకుంది లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2. ఇప్పటిదాకా 2024లో జరిగిన బాలీవుడ్ రిలీజుల్లో కల్కినే సుమారు 295 కోట్లతో అగ్ర స్థానంలో ఉంది. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ కంటెంట్ కి ఫిదా అయిన ఉత్తరాది ప్రేక్షకులు ప్రభాస్ మూవీకి బ్రహ్మరథం పట్టారు. అయితే స్త్రీ 2 ఇంకా రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే 242 కోట్లను దాటేయడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. పెద్ద మార్జిన్ తో కల్కిని సులభంగా దాటేస్తుందని ముంబై విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూస్తుంటే ఇదేమి అసాధ్యం కాదనిపిస్తోంది.
ఎందుకంటే ఫైనల్ రన్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఇప్పుడప్పుడే పెద్ద రిలీజులు లేవు. సరిపోదా శనివారం హిందీ వెర్షన్ ఆగస్ట్ 29 వస్తుంది కానీ స్త్రీ 2ని తీవ్రంగా ప్రభావితం చేయకపోవచ్చని అనుకుంటున్నారు. తెలుగులో బాగా ఆడిన దసరా, హాయ్ నాన్నలు అక్కడ ఆశించిన మేజిక్ చేయలేకపోయాయి. కానీ ఈసారి ఈ సెంటిమెంట్ మార్చాలనే పట్టుదలతో నాని ఉన్నాడు. ఇక స్త్రీ 2 సంగతి చూస్తే వీక్ డేస్ లోనూ మంచి జోరు చూపించడంతో బయ్యర్ల సంతోషం అంతా ఇంతా కాదు. యానిమల్ తర్వాత మళ్ళీ రోజుల తరబడి థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు దీనికే చూస్తున్నామని అంటున్నారు.
స్టార్ లేకుండా రాజ్ కుమార్ రావు లాంటి చిన్న సైజు హీరోతో శ్రద్ధా కపూర్ ని టైటిల్ రోల్ లో పెట్టి ఇంత ఫలితం అందుకోవడం ఎవరూ ఊహించనిది. అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్ లాంటి ప్రముఖులు ఈ విజయాన్ని చూసి మహదానంద పడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో కల్కిని స్త్రీ 2ని పూర్తిగా అందుకోవడం జరగని పని.
మూడు నుంచి నాలుగు వందల కోట్ల దగ్గర క్లోజ్ అవ్వొచ్చని ఒక ప్రిడిక్షన్. ఏది ఏమైనా ఈ మధ్య కామెడీ హారర్ జానర్ కు మళ్ళీ ఊపొచ్చింది. ఆ మధ్య ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ముంజ్యా సర్ప్రైజ్ హిట్టు కొట్టింది.
This post was last modified on August 20, 2024 5:16 pm
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…