టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా కీలకంగా భావించిన జెండా పండగ నీరుగారిపోయింది. భారీ అంచనాలు మోసుకొచ్చిన పెద్ద హీరోల సినిమాలు నిరాశ పరచడం బయ్యర్లకు శరాఘాతంగా మారింది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండూ ఒకదాన్ని మించి మరొకటి ప్రేక్షకులను భయపెట్టడంతో సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు పెర్ఫార్మన్స్ చాలా బాగున్నప్పటికీ అధిక శాతం థియేటర్లను ఫీడ్ చేయడానికి ఇవి సరిపోవు. స్టార్ హీరోలకు ఆకర్షితులైనంతగా మాస్ జనాలు వీటిని చూడరు. అందుకే నెంబర్లు మహా అయితే పది ఇరవై కోట్ల మధ్యలో ఉంటాయి.
వచ్చే ఆగస్ట్ 23 సైతం చిన్న చిత్రాలే ఉండటంతో అందరి కన్ను ఆగస్ట్ 29 వైపు వెళ్తోంది. నాని దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద నిర్మాత డివివి దానయ్య బృందం బలమైన నమ్మకంతో ఉంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. దసరా, హాయ్ నాన్న సూపర్ హిట్స్ తర్వాత నాని చేసిన మూవీ కావడంతో బిజినెస్ పరంగానూ క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంది. ప్రమోషన్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. నాని ప్రత్యేకంగా ప్రక్క రాష్ట్రాలకు వెళ్లి మీడియా, అభిమానులను కలుస్తున్నాడు. హిట్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
సో సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. ఎలాగూ సరిపడా థియేటర్లు దొరుకుతాయి. కాంపిటీషన్ లేదు. ఆపై వారం టెన్షన్ అక్కరలేదు. టాక్ అందుకుంటే చాలు థియేటర్లు నిండిపోతాయి. కథ మొత్తం అరటిపండు వలిచినట్టు చెప్పేస్తున్న నాని టీమ్ దాన్ని బట్టే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఎస్జె సూర్య విలనిజం ప్రధాన ఆకర్షణ కాబోతోంది. జెక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైప్ పెంచేసింది. ఆగస్ట్ నెల భారాన్ని చేతుల్లోకి తీసుకున్న శనివారం ఆ బాధ్యతను నెరవేర్చాలనేదే అందరి కోరిక.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…