Movie News

మ్యాడ్ మాస్ కాంబో.. ఆరంభం రేపే

ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎంతకీ పట్టాలెక్కట్లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఓ అసంతృప్తి ఉంది. అది కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తీయబోతున్న చిత్రమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కాంబినేషన్ మూడేళ్ల కిందటే ఓకే అయింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనున్న చిత్రమిది. సలార్ కంటే ముందే ఈ చిత్రం అనుకున్నప్పటికీ రకరకాల కారణాల వల్ల ఆలస్యమైంది.

‘సలార్’ రిలీజ్ తర్వాత దానికి సీక్వెల్ తీయడానికి ప్రశాంత్ రెడీ అవుతున్నాడన్న వార్తలతో తారక్ మూవీ ఎప్పుడా అనే ప్రశ్నలు తలెత్తాయి. అసలీ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్లు కూడా వచ్చాయి. ఐతే ‘సలార్-2’ను వెనక్కి నెట్టి తారక్ సినిమా చేయడానికే ప్రశాంత్ ఇప్పుడు రెడీ అవడం నందమూరి అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.

తారక్-ప్రశాంత్ నీల్‌ల మ్యాడ్ మాస్ కాంబో మూవీకి ముహూర్తం కూడా కుదిరింది. శుక్రవారమే ఈ చిత్రానికి రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ వేడుకను కొంచెం సింపుల్‌గానే చేయబోతున్నారట. తారక్, ప్రశాంత్ ఇద్దరూ ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఏదో మొక్కుబడిగా ప్రారంభోత్సవం చేయడం కాదు.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తారని అంటున్నారు.

తారక్ ఆల్రెడీ ‘దేవర-1’కు సంబంధించి తన పని అంతా దాదాపుగా పూర్తి చేసేశాడని సమాచారం. డబ్బింగ్ వర్క్ మాత్రం కొంత పెండింగ్ ఉందట. ప్రశాంత్‌తో తారక్ చేయనున్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. ప్రశాంత్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు ఇది కొంచెం భిన్నంగా ఉంటుందని సమాచారం.

Satya

Recent Posts

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

58 minutes ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

3 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

5 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

6 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

7 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

8 hours ago