జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న దేవర విడుదలకు ఇంకొక్క 55 రోజులు మాత్రమే ఉందనే సంగతి అభిమానులకు టెన్షన్ కలిగిస్తోంది. ఇప్పటిదాకా వచ్చింది ఒక ఆడియో సింగల్ మాత్రమే. రెండోది వచ్చే వారం రిలీజ్ కావొచ్చని ఇన్ సైడ్ టాక్. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సాంగ్ సిద్ధంగా ఉందని, ఫైనల్ మిక్సింగ్ ఆలస్యం కావడం తప్పించి వేరే కారణం లేదని అంటున్నారు. ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయో బయటికి చెప్పడం లేదు. మొత్తం నాలుగని వినికిడి. వాటిలో ఒక భారీ డాన్స్ నెంబర్ ఉంది. మరొకటి జాన్వీ కపూర్ తో ఆడిపాడిన డ్యూయెట్ మెలోడీ.
ఇకపై దేవరకు ప్రతిరోజు పరుగు పందెమే. భారీ పబ్లిసిటీకి రంగం సిద్ధం చేసుకోవాలి. ఇంకా షూటింగ్ చివరి దశలోనే ఉన్న దేవరకు ఎప్పుడు గుమ్మడికాయ కొడతారాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా రావాలంటే అతనికి తగిన సమయం ఇవ్వాలి. అది కూడా చెన్నైలోనే జరగాలి. మరి ఫస్ట్ కాపీ వీలైనంత త్వరగా రెడీ చేస్తే తప్ప ఈ ముందడుగు పడదు. పైగా అనిరుధ్ డేట్స్ ముందే లాక్ చేసుకోవాలి. చివరి నిమిషంలో కనక ఒత్తిడి చేస్తే ఇండియన్ 2 లాగా సగం ఉడికిన అవుట్ ఫుట్ వస్తుంది.
సెప్టెంబర్ 27 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే లక్ష్యంతో కొరటాల శివ బృందం కష్టపడుతోంది. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు వగైరాలు చాలా ప్లాన్ చేసుకోవాలి. బయ్యర్లు లాక్ చేసుకుంటున్న డీల్స్ వింటుంటే మతులు పోతున్నాయి. అవి రికవర్ కావాలంటే ఓపెనింగ్స్ ఆర్ఆర్ఆర్, కల్కి రేంజ్ లో రావాలి. దానికి తగ్గట్టే దేవర రూపొందిందని ఇన్ సైడ్ టాక్. ఇదింకా మొదటి భాగమే అయినా బాహుబలి తరహాలో సీక్వెల్ మీద విపరీతమైన ఆసక్తి పుట్టించేలా కంటెంట్ వచ్చిందని, ఖచ్చితంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుందని టీమ్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on August 2, 2024 2:37 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…