టాలీవుడ్లో ఎక్కువగా పర భాషా కథానాయికలదే హవా. స్టార్ హీరోయిన్లందరూ వాళ్లే. ఐతే పది పదిహేనేళ్లుగా నటిస్తున్న కొందరు హీరోయిన్లు కూడా ఇప్పటికీ తెలుగులో మాట్లాడలేని పరిస్థితి. డబ్బింగ్ మీదే ఆధారపడుతుంటారు. వాయిస్ బాలేక డబ్బింగ్కు వెళ్తే ఓకే కానీ.. ఎన్నేళ్లు ఇక్కడ ఉన్నా భాష నేర్చుకోకపోవడం అంటే వాళ్ల కమిట్మెంట్ మీద సందేహాలు కలుగుతాయి. ఐతే ఇప్పుడో హీరోయిన్ తెలుగులో తాను చేస్తున్న తొలి చిత్రంతోనే సొంత గొంతు వినిపించబోతోంది.
టాలీవుడ్లో ఇప్పటికే సెన్సేషన్గా మారిన ఆ అమ్మాయే.. భాగ్యశ్రీ బోర్సే. ఈ మాజీ మోడల్.. మాస్ రాజా రవితేజ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ససంబంధించి పాటలు, ఇతర ప్రోమోల్లో భాగ్యశ్రీ ఎంతగా హైలైట్ అయిందో తెలిసిందే. తన అందచందాలు, హావభావాల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమా రిలీజ్కు ముందే ఆమె స్టార్ స్టేటస్ సంపాదించేసింది.
ఇప్పుడు భాగ్యశ్రీ అభిమానులతో మరిన్ని మంచి మార్కులు వేయించుకునే పని చేసింది. ‘మిస్టర్ బచ్చన్’లో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. దీనికి సంబంధించి మిస్టర్ బచ్చన్ టీం అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఒకప్పటి హీరోయిన్లతో పోలిస్తే ప్రస్తుత కథానాయికలు డబ్బింగ్ చెప్పుకోవడానికి మంచి ప్రయత్నమే చేస్తున్నారు. ఐతే రెండు మూడు సినిమాలు చేశాకే డబ్బింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ తెలుగులో చేస్తున్న తొలి చిత్రానికే ఇలా వాయిస్ ఇచ్చేవాళ్లు మాత్రం అరుదు.
ఇది భాగ్యశ్రీ కమిట్మెంట్ను సూచిస్తుంది. అందుకే ఆమె మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రోమోల్లో తన అందచందాలతో ఆకట్టుకుని రెండు సినిమాల్లో ఛాన్సులు కూడా పట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ టాలెంట్ కూడా చూపిస్తే ఆమెను ఆపడం కష్టమేనేమో. త్వరలోనే ఆమెను పెద్ద స్టార్గా చూడబోతున్నామన్నమాట.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…