టాలీవుడ్లో ఎక్కువగా పర భాషా కథానాయికలదే హవా. స్టార్ హీరోయిన్లందరూ వాళ్లే. ఐతే పది పదిహేనేళ్లుగా నటిస్తున్న కొందరు హీరోయిన్లు కూడా ఇప్పటికీ తెలుగులో మాట్లాడలేని పరిస్థితి. డబ్బింగ్ మీదే ఆధారపడుతుంటారు. వాయిస్ బాలేక డబ్బింగ్కు వెళ్తే ఓకే కానీ.. ఎన్నేళ్లు ఇక్కడ ఉన్నా భాష నేర్చుకోకపోవడం అంటే వాళ్ల కమిట్మెంట్ మీద సందేహాలు కలుగుతాయి. ఐతే ఇప్పుడో హీరోయిన్ తెలుగులో తాను చేస్తున్న తొలి చిత్రంతోనే సొంత గొంతు వినిపించబోతోంది.
టాలీవుడ్లో ఇప్పటికే సెన్సేషన్గా మారిన ఆ అమ్మాయే.. భాగ్యశ్రీ బోర్సే. ఈ మాజీ మోడల్.. మాస్ రాజా రవితేజ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ససంబంధించి పాటలు, ఇతర ప్రోమోల్లో భాగ్యశ్రీ ఎంతగా హైలైట్ అయిందో తెలిసిందే. తన అందచందాలు, హావభావాల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమా రిలీజ్కు ముందే ఆమె స్టార్ స్టేటస్ సంపాదించేసింది.
ఇప్పుడు భాగ్యశ్రీ అభిమానులతో మరిన్ని మంచి మార్కులు వేయించుకునే పని చేసింది. ‘మిస్టర్ బచ్చన్’లో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. దీనికి సంబంధించి మిస్టర్ బచ్చన్ టీం అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఒకప్పటి హీరోయిన్లతో పోలిస్తే ప్రస్తుత కథానాయికలు డబ్బింగ్ చెప్పుకోవడానికి మంచి ప్రయత్నమే చేస్తున్నారు. ఐతే రెండు మూడు సినిమాలు చేశాకే డబ్బింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ తెలుగులో చేస్తున్న తొలి చిత్రానికే ఇలా వాయిస్ ఇచ్చేవాళ్లు మాత్రం అరుదు.
ఇది భాగ్యశ్రీ కమిట్మెంట్ను సూచిస్తుంది. అందుకే ఆమె మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రోమోల్లో తన అందచందాలతో ఆకట్టుకుని రెండు సినిమాల్లో ఛాన్సులు కూడా పట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ టాలెంట్ కూడా చూపిస్తే ఆమెను ఆపడం కష్టమేనేమో. త్వరలోనే ఆమెను పెద్ద స్టార్గా చూడబోతున్నామన్నమాట.
This post was last modified on July 31, 2024 2:55 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…