టాలీవుడ్లో ఎక్కువగా పర భాషా కథానాయికలదే హవా. స్టార్ హీరోయిన్లందరూ వాళ్లే. ఐతే పది పదిహేనేళ్లుగా నటిస్తున్న కొందరు హీరోయిన్లు కూడా ఇప్పటికీ తెలుగులో మాట్లాడలేని పరిస్థితి. డబ్బింగ్ మీదే ఆధారపడుతుంటారు. వాయిస్ బాలేక డబ్బింగ్కు వెళ్తే ఓకే కానీ.. ఎన్నేళ్లు ఇక్కడ ఉన్నా భాష నేర్చుకోకపోవడం అంటే వాళ్ల కమిట్మెంట్ మీద సందేహాలు కలుగుతాయి. ఐతే ఇప్పుడో హీరోయిన్ తెలుగులో తాను చేస్తున్న తొలి చిత్రంతోనే సొంత గొంతు వినిపించబోతోంది.
టాలీవుడ్లో ఇప్పటికే సెన్సేషన్గా మారిన ఆ అమ్మాయే.. భాగ్యశ్రీ బోర్సే. ఈ మాజీ మోడల్.. మాస్ రాజా రవితేజ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ససంబంధించి పాటలు, ఇతర ప్రోమోల్లో భాగ్యశ్రీ ఎంతగా హైలైట్ అయిందో తెలిసిందే. తన అందచందాలు, హావభావాల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమా రిలీజ్కు ముందే ఆమె స్టార్ స్టేటస్ సంపాదించేసింది.
ఇప్పుడు భాగ్యశ్రీ అభిమానులతో మరిన్ని మంచి మార్కులు వేయించుకునే పని చేసింది. ‘మిస్టర్ బచ్చన్’లో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. దీనికి సంబంధించి మిస్టర్ బచ్చన్ టీం అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఒకప్పటి హీరోయిన్లతో పోలిస్తే ప్రస్తుత కథానాయికలు డబ్బింగ్ చెప్పుకోవడానికి మంచి ప్రయత్నమే చేస్తున్నారు. ఐతే రెండు మూడు సినిమాలు చేశాకే డబ్బింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ తెలుగులో చేస్తున్న తొలి చిత్రానికే ఇలా వాయిస్ ఇచ్చేవాళ్లు మాత్రం అరుదు.
ఇది భాగ్యశ్రీ కమిట్మెంట్ను సూచిస్తుంది. అందుకే ఆమె మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రోమోల్లో తన అందచందాలతో ఆకట్టుకుని రెండు సినిమాల్లో ఛాన్సులు కూడా పట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ టాలెంట్ కూడా చూపిస్తే ఆమెను ఆపడం కష్టమేనేమో. త్వరలోనే ఆమెను పెద్ద స్టార్గా చూడబోతున్నామన్నమాట.
This post was last modified on July 31, 2024 2:55 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…