డిసెంబర్ 6 పుష్ప 2 ది రూల్ వచ్చేస్తుందనే ధీమా అభిమానుల్లో బలంగా ఉంది. ఆగస్ట్ 15 లాంటి మంచి డేట్ వదులుకోవడం పట్ల నిర్మాతలు కలవరపడుతున్నా పరిస్థితులు దానికి ప్రేరేపించాయి కాబట్టి ఎవరూ ఏం చేయలేరు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ షూటింగ్ ని రీ స్టార్ట్ చేశారు. త్వరలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ కు సంబంధించిన ముఖ్యమైన ఎపిసోడ్స్ ని ప్లాన్ చేశారని తెలిసింది. నిజానికి రిలీజ్ డేట్ మిస్ కావడంలో ప్రధాన పాత్ర పోషించిన కారణాల్లో ఫహద్ డేట్లు దొరక్కపోవడం కూడా ఉంది. సరే అంతా సవ్యంగా ఉంది కదా కొత్త ప్రచారాలు ఏంటనుకుంటున్నారా.
కొన్ని ముంబై వర్గాలు పుష్ప 2 డిసెంబర్ లో వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయని, 2025 వేసవికి వాయిదా పడొచ్చనే రీతిలో కథనాలు వెలువరించడంతో బన్నీ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ వెర్షన్ కు బలం చేరకూర్చేలా డిసెంబర్ 6నే బాలీవుడ్ మూవీ చావాని విడుదల చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే సమాచారం కొత్తగా తోడయ్యింది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాలో హీరోయిన్ రష్మిక మందన్నే కావడం కాకతాళీయం. పుష్ప 2తో క్లాష్ అయ్యేందుకు రోహిత్ శెట్టి లాంటి స్టార్ డైరెక్టరే వెనుకడుగు వేసినప్పుడు చావాకు అంత ధైర్యం ఎక్కడిదనే డౌట్ సహజం.
ఇదంతా ఇప్పుడప్పుడే తేలే యవ్వారం కాదు. పుష్ప చేతిలో కేవలం 4 నెలల సమయం మాత్రమే ఉంది. బ్యాలన్స్ టాకీ పార్ట్ తో పాటు స్పెషల్ సాంగ్ పూర్తి చేయాలి. ప్రమోషన్లు, పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు, సాంగ్స్ లాంచులు, వివిధ రాష్ట్రాల పర్యటనలు, మీడియా ఇంటర్వ్యూలు ఇలా బోలెడు పనులు పీకల మీద ఉంటాయి. పైగా సెన్సార్ ప్రివ్యూకు ముందు రోజు వరకూ ఎడిటింగ్ రూంలో ఉంటాడనే పేరున్న సుకుమార్ ఈసారి అడ్వాన్స్ గా ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తారానేది పెద్ద ప్రశ్న. ఇప్పటికైతే రెండు పాటలు వచ్చేశాయి. అక్టోబర్ లో టీజర్ ప్లాన్ చేస్తున్నారట. పరుగులు పెట్టయినా సరే ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు.
This post was last modified on July 30, 2024 2:10 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…