Movie News

హీరో లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్

చిన్నదో పెద్దదో సినిమా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజుల్లో సర్వసాధారణం. ప్రమోషన్లలో కీలకంగా భావించే ఈ ఘట్టంలో దానికి పని చేసిన వాళ్లందరూ వచ్చేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా హీరో లేకుండా వేడుక నిర్వహించడం ఊహించగలమా. కానీ రాజ్ తరుణ్ కు ఈ సంకట పరిస్థితి వచ్చింది. ఈ నెల 26న విడుదల కాబోతున్న పురుషోత్తముడు ఈవెంట్ ని అతను లేకుండా నిర్వహించేశారు. హీరోయిన్ హాసినితో పాటు బ్రహ్మానందం తదితరులు విచ్చేయగా కేవలం మూవీ గురించి మాట్లాడి నడిపించేశారు తప్పించి ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాకుండా చూసుకున్నారు.

నిజానికి ఈ వారం వస్తున్న సినిమాల లిస్టు ప్రకారం బజ్ రావాల్సిన వాటిలో పురుషోత్తముడు ముందుండాలి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి పెద్ద క్యాస్టింగ్ తో పాటు బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. కానీ దీని స్థానంలో ధనుష్ డబ్బింగ్ మూవీ రాయన్ కే ఎక్కువ బజ్ కనిపిస్తోంది. మరి ప్రమోషన్లకు టైం లేకపోయినా, రాజ్ తరుణ్ బయట కనిపించే పరిస్థితిలో లేకపోయినా ఇంత హడావిడిగా ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తోందనేది పెద్ద ప్రశ్న. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓటిటి ఒప్పందం ఒక కారణమై ఉండొచ్చని అంటున్నారు. మూడు రోజుల్లో హైప్ అమాంతం పెంచడం కష్టం.

ఒకవేళ టాక్ మరీ బాగుంటే జనాలు రాజ్ తరుణ్ కేసులో ఉన్న సంగతి మర్చిపోయి మరీ పురుషోత్తముడుని థియేటర్లలో చూస్తారు కానీ అలా జరగకపోతే మాత్రం ఇబ్బందే. కల్కి 2898 ఏడి జోరు తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్ళీ నెమ్మదించేసింది. ప్రేక్షకులను రప్పించే స్థాయిలో ఏవీ అంచనాలు రాబట్టుకోలేకపోయాయి. ప్రియదర్శి డార్లింగ్ డీసెంట్ గా ఉన్నా వర్కౌట్ అయ్యేది కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. గోపి సుందర్ సంగీతం, పిజి విందా ఛాయాగ్రహణం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పని చేసిన ఈ పురుషోత్తముడులో హాసిని హీరోయిన్ గా నటించింది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

59 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago