కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్కు బహు భాషల్లో నటిగా మంచి పేరుంది. కన్నడలో ‘యు టర్న్’ మూవీతో మంచి పేరు సంపాదించాక ఆమె వేర్వేరు భాషల్లో విలక్షణ పాత్రలు పోషించింది. తెలుగులో ఆమెకు ‘జెర్సీ’ ఎంత ఫేమ్ తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరో సరసన ‘సైంధవ్’ లాంటి పెద్ద సినిమా చేసే అవకాశం దక్కించుకుంది శ్రద్ధ. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడం, అందులో శ్రద్ధ పాత్ర కూడా అంతంతమాత్రం కావడంతో నిరాశ తప్పలేదు. తర్వాత తెలుగులో ఆమెకు వెంటనే అవకాశాలు రాలేదు. కానీ కొంచెం గ్యాప్ తర్వాత నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో సరసన శ్రద్ధకు ఛాన్స్ వచ్చిందన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నటిగా శ్రద్ధ జర్నీ చూసినా.. ఆమె ఎంచుకున్న సినిమాలు, పాత్రలు చూసినా.. బాలయ్య లాంటి మాస్ హీరో సరసన ఆమె ఏమాత్రం సూటవుతుందో అన్న సందేహాలు కలుగుతాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మాస్లో రీచ్ కోసమైనా ఇలాంటి సినిమాలు చేయాల్సిందే అనిపిస్తుంది. ఐతే ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి శ్రద్ధ చేజారిందన్నది తాజా వార్త. షూట్లోకి వెళ్లాక తను సూట్ కాదని ఈ పాత్ర నుంచి తప్పించారా లేక ముందే ఏమైనా జరిగి ఆమెకు నో చెప్పారా అన్నది తెలియదు కానీ.. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ మాత్రం లేదన్నది తాజా సమాచారం. ఆమె స్థానంలోకి ప్రగ్యా జైశ్వాల్ వచ్చిందటున్నారు.
ఐతే బాలయ్య సినిమా నుంచి శ్రద్ధ ఔట్ అని వార్త హల్చల్ చేస్తున్న సమయంలోనే మరో చిత్రంలో శ్రద్ధ నటిస్తున్న సంగతి వెల్లడైంది. బాలయ్య, ఎన్టీఆర్ల అభిమానిగా చెప్పుకోవడమే కాదదు, వాళ్లిద్దరితో బాగా సాన్నిహిత్యం ఉన్న విశ్వక్సేన్ సరసన శ్రద్ధ నటిస్తోంది. ఆ చిత్రమే.. మెకానిక్ రాకీ. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ అని అన్నారు. మరి ఆమెతో పాటు శ్రద్ధ కూడా ఉందా.. లేక మీనాక్షి స్థానంలోకి శ్రద్ధ వచ్చిందా అన్నది తెలియదు కానీ.. ఈ చిత్రం నుంచి పోష్ లుక్తో ఉన్న శ్రద్ధ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. మొత్తానికి బాలయ్యతో సినిమా అనుకుంటే ఆయన అభిమాని చిత్రంలో నటిస్తోందన్నమాట శ్రద్ధ.
This post was last modified on July 22, 2024 10:23 am
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…