మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందిన మిస్టర్ బచ్చన్ విడుదల తేదీ విషయంలో ఇంకా నిర్ణయం వెలువబడలేదు. ఆగస్ట్ 15 అని అంతర్గత వర్గాల్లో బలంగా వినిపిస్తోంది కానీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. అంటే ఆలోచనలో ఉన్నారని అర్థమవుతోంది. ఆ డేట్ కి రామ్ పూరిల డబుల్ ఇస్మార్ట్, గీత ఆర్ట్స్ 2 నిర్మించిన ఆయ్ తో పాటు 35 చిన్న కథ కాదు అనే మరో చిన్న సినిమా అధికారికంగా లాకయ్యాయి. విక్రమ్ తంగలాన్ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. ఆ టీమ్ నుంచి ప్రకటన రావడం ఒకటే పెండింగ్ ఉంది.
ఇక్కడ చిన్నపాటి చిక్కులున్నాయి. ఆగస్ట్ 2 ఆప్షన్ ఉంది చేతిలో ఉన్న తక్కువ టైంలో ప్రమోషన్లు చేసుకోవడం కష్టం. పోనీ అదే నెల చివరి వారంకు వెళదామంటే నాని సరిపోదా శనివారం సిద్ధంగా ఉంది. ఇండిపెండెన్స్ డే వారం మంచి టైం కావడంతో దాని మీద నిర్మాతలు గురి పెడుతున్నారు కానీ ఆల్రెడీ బరిలో ఉన్నవాటికి ఇబ్బంది కలిగించినట్టు అవుతుంది. అదేమీ సమస్య కాదనుకున్నా డబుల్ ఇస్మార్ట్ తో పోటీని కొంచెం సీరియస్ గా విశ్లేషించుకోవాలి. బాలీవుడ్ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ పాటల నుంచే ఆడియన్స్ లో అంచనాలు పెంచడం మొదలైంది.
ఈ లెక్కన సెప్టెంబర్ కు వెళ్లడం మినహా వేరే మార్గం ఉండకపోవచ్చు. ఆ నెల మొదటివారంలో నారా రోహిత్ సుందరకాండ, అల్లరి నరేష్ బచ్చల మల్లి, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లు కాచుకోవచ్చు. 27న దేవర ఉంటుంది కాబట్టి దానికి ముందు వెనుకా వచ్చేందుకు పెద్ద బడ్జెట్ సినిమాలు రిస్క్ తీసుకోవు. ఇప్పటికైతే మిస్టర్ బచ్చన్ డేట్ సస్పెన్స్ గానే ఉంది. ఇంకోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ఒరిజినల్ వెర్షన్ రైడ్ ని మరిపించేలా దర్శకుడు హరీష్ శంకర్ చాలా మార్పులు చేసినట్టు టీజర్ శాంపిల్స్ లో అర్థమైపోయింది.
This post was last modified on July 19, 2024 1:27 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…