Movie News

దేవరకు ఇంకో విలన్ కావలెను

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27 విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ పూర్తయిన భాగానికి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. మళ్ళీ పాల్గొనే అవసరం లేని ఆర్టిస్టులతో ఈ తతంగం పూర్తి చేస్తున్నారు.

రెండో ఆడియో సింగల్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకో డెబ్భై రోజుల సమయం మాత్రమే ఉండటంతో టీమ్ నింపాదిగా లేదు. ప్యాన్ ఇండియా ప్రమోషన్లు చేసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా కనీసం ఒక నెల ముందు తగినంత ప్లానింగ్ అవసరం. అప్పుడే ఒత్తిడి లేకుండా సాఫీగా పని జరుగుతుంది.

ఇదంతా ఓకే కానీ దేవరలో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది రెండు భాగాలు కాబట్టి మరొక బలమైన ప్రతినాయకుడు అవసరమట. దాని కోసం యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ని సంప్రదించే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం.

ఇతను ఇప్పటికే హరిహర వీరమల్లు, బాలయ్య 109లో భాగమై ఉన్నాడు. దేవర 2 కోసం అడిగారని తెలుస్తోంది. సీక్వెల్ కి సంబంధించిన కొంత భాగం కొరటాల ఇప్పటికే తీసినప్పటికి బ్యాలన్స్ చాలా ఉందట. అక్కడ బాబీ డియోల్ లాంటి ఆర్టిస్టు అవసరం ఉందని వినికిడి. ఇంకా అఫీషియల్ కాలేదు.

అంచనాల పరంగా పెద్ద బరువు మోస్తున్న దేవర అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి షిఫ్ట్ కావడంతో అభిమానులు ఆ డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన గుర్తింపు రెట్టింపు చేసే స్థాయిలో ఇందులో విశ్వరూపం చూడొచ్చని గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. వాటి తీరుతెన్నులు సంబంధాలు ప్రస్తుతానికి గుట్టుగానే ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవరకు అనిరుద్ రవిచందర్ ఇచ్చిన మొదటి పాట ఛార్ట్ బస్టర్ అయ్యింది. రెండో సాంగ్ ఎలా ఉండబోతోందో త్వరలోనే తేలనుంది.

This post was last modified on July 15, 2024 5:56 am

Share
Show comments
Published by
Satya
Tags: Devara

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago