2008లో ఐపీఎల్ ఆరంభమైనపుడు దాని ప్రెజెంటర్గా కనిపించిన కుర్రాడు ఆయుష్మాన్ ఖురానా. కొన్ని సీజన్ల పాటు అతను ఐపీఎల్ ప్రెజెంటర్గా పని చేశాడతను. ఆ వ్యక్తి ఇప్పుడు సాధించిన ఘనత చూసి నోరెళ్లబెట్టకుండా ఉండలేం. టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ.. జనాల మీద విశేషమైన ప్రభావం చూపే వ్యక్తులకు ఇందులో చోటు దక్కుతుంది.
ఇందులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఆయుష్మాన్ ఖురానానే ఒకడు కావడం విశేషం. ఈ జాబితాలో ఉన్న మరో వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. భారత ప్రధాన మంత్రి అంటే ఎంత పవర్ ఫుల్ వ్యక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం ఏమీ కాదు.
కానీ ఇండియాలో వివిధ భాషల్లో ఎంతో మంది సూపర్ స్టార్లు ఉండగా.. ఆయుష్మాన్ వాళ్లను వెనక్కి నెట్టి టైమ్-100 జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఐపీఎల్ యాంకర్గా పని చేసే సమయంలోనే ఆయుష్మాన్ టీవీ సీరియళ్లలోనూ నటించేవాడు. జాన్ అబ్రహాం నిర్మించిన ‘విక్కీ డోనర్’ సినిమాతో అతను హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా సంచలనం విజయం సాధించింది. ఆ విజయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ఆ తర్వాత మంచి మంచి సినిమాలు ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకెళ్లాడు ఆయుష్మాన్.
గత కొన్నేళ్లలో బదాయి హో, అందాదున్, ఆర్టికల్ 15 లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి అతడి నుంచి. బాలీవుడ్లో ఎంతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నిలకడగా విజయాలు సాధిస్తున్న హీరోల జాబితా తీస్తే అతనే ముందుంటాడు. ఆయుష్మాన్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారిప్పుడు. అతడి సినిమాలు అలవోకగా వంద కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడికి టైమ్ జాబితాలో చోటు దక్కింది.
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం…
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య…
రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ…