2008లో ఐపీఎల్ ఆరంభమైనపుడు దాని ప్రెజెంటర్గా కనిపించిన కుర్రాడు ఆయుష్మాన్ ఖురానా. కొన్ని సీజన్ల పాటు అతను ఐపీఎల్ ప్రెజెంటర్గా పని చేశాడతను. ఆ వ్యక్తి ఇప్పుడు సాధించిన ఘనత చూసి నోరెళ్లబెట్టకుండా ఉండలేం. టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ.. జనాల మీద విశేషమైన ప్రభావం చూపే వ్యక్తులకు ఇందులో చోటు దక్కుతుంది.
ఇందులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఆయుష్మాన్ ఖురానానే ఒకడు కావడం విశేషం. ఈ జాబితాలో ఉన్న మరో వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. భారత ప్రధాన మంత్రి అంటే ఎంత పవర్ ఫుల్ వ్యక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం ఏమీ కాదు.
కానీ ఇండియాలో వివిధ భాషల్లో ఎంతో మంది సూపర్ స్టార్లు ఉండగా.. ఆయుష్మాన్ వాళ్లను వెనక్కి నెట్టి టైమ్-100 జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఐపీఎల్ యాంకర్గా పని చేసే సమయంలోనే ఆయుష్మాన్ టీవీ సీరియళ్లలోనూ నటించేవాడు. జాన్ అబ్రహాం నిర్మించిన ‘విక్కీ డోనర్’ సినిమాతో అతను హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా సంచలనం విజయం సాధించింది. ఆ విజయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ఆ తర్వాత మంచి మంచి సినిమాలు ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకెళ్లాడు ఆయుష్మాన్.
గత కొన్నేళ్లలో బదాయి హో, అందాదున్, ఆర్టికల్ 15 లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి అతడి నుంచి. బాలీవుడ్లో ఎంతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నిలకడగా విజయాలు సాధిస్తున్న హీరోల జాబితా తీస్తే అతనే ముందుంటాడు. ఆయుష్మాన్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారిప్పుడు. అతడి సినిమాలు అలవోకగా వంద కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడికి టైమ్ జాబితాలో చోటు దక్కింది.
This post was last modified on September 23, 2020 3:09 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…