2008లో ఐపీఎల్ ఆరంభమైనపుడు దాని ప్రెజెంటర్గా కనిపించిన కుర్రాడు ఆయుష్మాన్ ఖురానా. కొన్ని సీజన్ల పాటు అతను ఐపీఎల్ ప్రెజెంటర్గా పని చేశాడతను. ఆ వ్యక్తి ఇప్పుడు సాధించిన ఘనత చూసి నోరెళ్లబెట్టకుండా ఉండలేం. టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ.. జనాల మీద విశేషమైన ప్రభావం చూపే వ్యక్తులకు ఇందులో చోటు దక్కుతుంది.
ఇందులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఆయుష్మాన్ ఖురానానే ఒకడు కావడం విశేషం. ఈ జాబితాలో ఉన్న మరో వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. భారత ప్రధాన మంత్రి అంటే ఎంత పవర్ ఫుల్ వ్యక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం ఏమీ కాదు.
కానీ ఇండియాలో వివిధ భాషల్లో ఎంతో మంది సూపర్ స్టార్లు ఉండగా.. ఆయుష్మాన్ వాళ్లను వెనక్కి నెట్టి టైమ్-100 జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఐపీఎల్ యాంకర్గా పని చేసే సమయంలోనే ఆయుష్మాన్ టీవీ సీరియళ్లలోనూ నటించేవాడు. జాన్ అబ్రహాం నిర్మించిన ‘విక్కీ డోనర్’ సినిమాతో అతను హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా సంచలనం విజయం సాధించింది. ఆ విజయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ఆ తర్వాత మంచి మంచి సినిమాలు ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకెళ్లాడు ఆయుష్మాన్.
గత కొన్నేళ్లలో బదాయి హో, అందాదున్, ఆర్టికల్ 15 లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి అతడి నుంచి. బాలీవుడ్లో ఎంతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నిలకడగా విజయాలు సాధిస్తున్న హీరోల జాబితా తీస్తే అతనే ముందుంటాడు. ఆయుష్మాన్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారిప్పుడు. అతడి సినిమాలు అలవోకగా వంద కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడికి టైమ్ జాబితాలో చోటు దక్కింది.
This post was last modified on September 23, 2020 3:09 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…