ఎప్పుడో 2019లో విడుదలైంది ‘గద్దలకొండ గణేష్’ సినిమా. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని మొదలుపెట్టాల్సింది హరీష్ శంకర్. కానీ ఆ చిత్రం అనౌన్స్మెంట్కే పరిమితమైంది. మూడేళ్ల పాటు పవన్ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాడు హరీష్.
చివరికి వేరే కథ ఎంచుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి అయితే వెళ్లింది కానీ.. చిత్రీకరణ సవ్యంగా సాగలేదు. వేరే కమిట్మెంట్లు కూడా ఉండడం వల్ల కొన్ని రోజులు మాత్రమే ఈ చిత్రానికి కాల్ షీట్స్ ఇచ్చాడు పవన్.
ఈలోపు ఏపీలో ఎన్నికలు వచ్చాయి. ‘ఉస్తాద్.. సంగతి అతీ గతీ లేకుండా పోయింది. పవన్ త్వరలో సినిమాలకు అందుబాటులోకి వస్తాడని అంటున్నా.. ‘ఉస్తాద్..’ ఆయన ప్రయారిటీ కాదని తెలుస్తోంది.
ఇప్పుడున్న బిజీ పొలిటికల్ షెడ్యూల్స్లో పవన్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను పూర్తి చేస్తే ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను పూర్తిగా ఆపేస్తున్నట్లుగా ఓ ప్రచారం మొదలైంది. దీని గురించి ట్విట్టర్లో ఎవరో ప్రస్తావిస్తే.. హరీష్ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యాడు.
అసలీ సినిమా మొదలే కాదని అన్నపుడే తాను రూమర్స్ను పట్టించుకోలేదని.. ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా తనకు లేదని హరీష్ తేల్చేశాడు. దీంతో ‘ఉస్తాద్..’ ఆగిపోలేదని ఒక క్లారిటీ వచ్చేసినట్లయింది. ఐతే పవన్ ఈ సినిమా కోసం డేట్లు కేటాయించడానికి మాత్రం చాలా టైమే పట్టేట్లుంది.
దీంతో ఈలోపు ‘మిస్టర్ బచ్చన్’ను రిలీజ్ చేయించి.. ఇంకో సినిమాను కూడా లాగించేయాలని హరీష్ చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన తర్వాతి సినిమా చిరంజీవితో ఉండొచ్చని కూడా అంటున్నారు.
This post was last modified on July 5, 2024 8:39 pm
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…