Movie News

రవితేజతో కాదు.. విశ్వక్‌తో

‘జాతిరత్నాలు’ సినిమాతో యువ దర్శకుడు అనుదీప్ కేవీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అంతకుముందే అతను ‘పిట్టగోడ’ అనే సినిమా తీసిన సంగతే జనాలకు తెలియదు. కానీ ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ హిట్టయి అనుదీప్‌కు ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. ఐతే దీని తర్వాత అనుదీప్ తీసిన ‘ప్రిన్స్’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ‘జాతిరత్నాలు’ తరహా కామెడీనే ట్రై చేసినా ఎందుకో వర్కవుట్ కాలేదు.

ఆ సినిమా తేడా కొట్టడంతో తర్వాతి సినిమాను లైన్లో పెట్టడంలో అనుదీప్ ఇబ్బంది పడుతున్నాడు. రకరకాల కాంబినేషన్లు అనుకుంటున్నా అవేవీ వర్కవుట్ కావడం లేదు. చివరగా మాస్ రాజా రవితేజతో అనుదీప్ సినిమా అని గట్టిగా ప్రచారం జరిగింది. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్నారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చనట్లే కనిపిస్తోంది.

అనుదీప్‌తో సినిమా ప్రచారంలోకి వచ్చాక రవితేజ.. ‘ఈగల్’ సినిమా చేశాడు. అది రిలీజవ్వడమే కాక ‘మిస్టర్ బచ్చన్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. కానీ అనుదీప్ సినిమా గురించి అతీ గతీ లేదు. తాజా సమాచారం ప్రకారం అనుదీప్.. రవితేజ సంగతి వదిలేసి వేరే హీరోను ఎంచుకున్నాడట. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో పలకరించిన విశ్వక్సేన్‌తో అనుదీప్ తర్వాతి సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది.

14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోందట. విశ్వక్ ఈ మధ్య వరుసగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు. ఈసారి రూటు మార్చి అనుదీప్‌తో కామెడీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరి కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనడం ఖాయం. మరి అనుదీప్ ‘జాతిరత్నాలు’ మ్యాజిక్‌ను ఈ సినిమాతో రిపీట్ చేస్తాడేమో చూడాలి.

This post was last modified on July 5, 2024 8:42 pm

Share
Show comments
Published by
Satya
Tags: anudeep

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago