ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఖరీదైన మందులు వాడలేని పరిస్థితిలో నీటిలో హైడ్రోజిన్ పెరాక్సాడ్ కలిపి దాన్ని నెబ్యులైజర్ ద్వారా పీల్చాలని సమంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద దుమారమే రేపింది. దీన్ని ఘాటుగా ఖండిస్తూ రెండు లక్షలకు పైగా ఫాలోయర్లున్న లివర్ డాక్ (డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్) అనే వైద్యుడు సుదీర్ఘమైన పోస్టు పెట్టడంతో ఈ టాపిక్ గురించి రెండు రకాల చర్చలు జరగడం మొదలయ్యాయి. సామ్ ఇలాంటి సలహాలు ఇచ్చినందుకు ఆమెను జైల్లో పెట్టినా తప్పు లేదనే రీతిలో లివర్ డాక్ పేర్కొనడం మరింత వివాదానికి దారి తీసింది. దీన్ని సమంత అక్కడితో వదిలేయలేదు.
పాతికేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ సూచనల మేరకు నేను ఫాలో అయిన ఎన్నో ఖరీదైన పద్దతులను విశ్లేషించుకున్న తర్వాత చెప్పాను తప్పించి ఎవరినో పక్కదారి పట్టించి డబ్బు సంపాదించే ఉద్దేశమే లేదని సమంత తేల్చి చెప్పింది. సామ్ కు మద్దతుగా నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎక్స్ లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి సమంతా ఉద్దేశం మంచిదే అయినా సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా జనం సీరియస్ గా ఫాలో అయ్యే అవకాశముంటుంది. అలాంటప్పుడు ఒకటికి పదిసార్లు అలోచించి పోస్ట్ చేయాలనేది నెటిజెన్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
సినిమా బాలేకపోయినా చూడమని చెప్పడంలో వీసమెత్తు నష్టం లేదు కానీ జబ్బులతో ముడిపడిన చికిత్సలు చిన్నవైనా పెద్దవైనా ఇలా పబ్లిక్ గా అభిప్రాయాలు పంచుకొవడం ఎంతైనా రిస్కే. సమంత ఎంత పెద్ద గండం నుంచి బయటపడిందో యశోద సమయంలో అందరూ చూశారు. శాకుంతలం ప్రమోషన్లకు సైతం ఇబ్బంది పడుతూనే హాజరయ్యింది. తర్వాత బ్రేక్ తీసుకుంది. ఖుషిలో పరవాలేదనిపించినా మళ్ళీ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. ప్రస్తుతం తెలుగులో తనకున్న కమిట్ మెంట్ మా ఇంటి బంగారం ఒక్కటే. షారుఖ్, విజయ్ సినిమాల్లో ఛాన్స్ వచ్చిందనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కావాలి.
This post was last modified on July 5, 2024 3:07 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…