ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ నుంచి మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేయడంతో అభిమానులు అలెర్ట్ అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ కు కొనసాగింపుగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
రామ్, పూరి ఇద్దరూ పెద్ద డిజాస్టర్ తర్వాత చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాల పరంగా చాలా పెద్ద బరువునే మోస్తున్నారు. ఆగస్ట్ 15 విడుదలకు రంగం సిద్ధం చేసుకుని దానికి తగ్గట్టు ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు.
ఇక పాట సంగతి చూస్తే మణిశర్మ మరోసారి పక్కా మాస్ బీట్ తో కంపోజ్ చేశారు. మొదటిసారి విన్నప్పుడు ఫస్ట్ పార్ట్ లో టైటిల్ సాంగ్ లాగే అనిపించినా రెండింటికి చాలా వ్యత్యాసమున్న విషయం మెల్లగా అర్థమవుతుంది.
సీక్వెల్ కాబట్టి గెటప్ తో సహా అన్ని రిపీట్ చేయడం వల్ల విజువల్ గా ఆ ఫీలింగ్ కలిగినా మంచి క్యాచీ ట్యూన్ తో మెలోడీ బ్రహ్మ ఈసారి మరింత మాస్ పల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అనురాగ్ కులకర్ణి, సాహితి గాత్రంలో భాస్కరభట్ల సాహిత్యం పూరి స్టాండర్డ్ కు తగ్గట్టే పూర్తి కమర్షియల్ స్కేల్ లో సాగింది. వినగా వినగా లిరిక్స్ ఆడియన్స్ లోకి వెళ్లేలా ఉన్నాయి.
ఛార్ట్ బస్టర్ అవుతుందో లేదో వెంటనే చెప్పలేం కానీ డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించి అంచనాలు పెంచడంలో మాత్రం కీలక పాత్ర పోషించేలా ఉంది. రిలీజ్ కు ఇంకో 45 రోజులే ఉన్న నేపథ్యంలో పూరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు.
ఆ రోజు రెండు చిన్న సినిమాలతో పాటు విక్రమ్ తంగలాన్ పోటీకి వస్తుండటంతో మార్కెట్ పరంగా డబుల్ ఇస్మార్ట్ కే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. అన్ని ప్రధాన భాషల్లో మల్టీ లాంగ్వేజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా ఫలితం పట్ల రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. నెక్స్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబుతో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 1, 2024 10:57 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…