ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి’ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రెస్పాన్స్ కూడా అదిరిపోయే స్థాయిలోనే వచ్చింది. వేసవిలో సరైన సినిమాలు లేక వెలవెలబోయిన బాక్సాఫీస్లో ఒక్కసారిగా ఉత్సాహం తీసుకొచ్చింది ‘కల్కి’ మూవీ. ఈ ఏడాది ఇండియా మొత్తాన్ని ఏకం చేసి థియేటర్ల వైపు పరుగులు పెట్టించిన చిత్రమిదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లు కళకళలాడాయి.
‘కల్కి’ తెలుగు సినిమా మరోసారి సగర్వంగా తలెత్తుకునేలా చేసిందనడంలో సందేహం లేదు. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ఓ యువ దర్శకుడిని నమ్మి వైజయంతీ మూవీస్ సంస్థ ఇంత భారీ సినిమాను ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో (దాదాపు రూ.700 కోట్లని అంచనా) రూపొందించడం చిన్న విషయం కాదు.
నాగ్ అశ్విన్ అశ్వినీదత్కు అల్లుడే కావచ్చు. అయినా అతడి అనుభవ లేమి గురించి కంగారు పడకుండా ఏమాత్రం రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించడం మామూలు సాహసం కాదు. సినిమాలో విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసి అశ్వినీదత్ మీద అందరికీ గౌరవభావం కలుగుతోంది. దర్శకుడితో పాటు నిర్మాతనూ అదే స్థాయిలో అభినందిస్తున్నారు జనం.
ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు గత కొన్నేళ్లలో తమకు నచ్చని వారి సినిమాలను టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ ఏమో జగన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీకి ఓపెన్గా మద్దతు ప్రకటించారు. ఈ సినిమా నిజానికి గత ఏడాదే రిలీజ్ కావాల్సింది. జగన్ ప్రభుత్వం ఉండగా ‘కల్కి’ రిలీజై ఉంటే మాత్రం అంతే సంగతులు. ఒకవేళ ఏపీలో ప్రభుత్వం మారకపోయి ఉన్నా ‘కల్కి’ టార్గెట్ అయ్యేది. మరి ఈ ప్రమాదం పొంచి ఉన్నా ఇంత భారీ సినిమా తీసి ధైర్యంగా టీడీపీకి మద్దతు పలికి, జగన్ను విమర్శించడం గుర్తు చేసుకుని దత్ గట్సే వేరని కొనియాడుతున్నారు నెటిజన్లు.
This post was last modified on June 28, 2024 9:08 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…