Movie News

దత్తు గారి గట్స్‌కు సెల్యూట్

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి’ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రెస్పాన్స్ కూడా అదిరిపోయే స్థాయిలోనే వచ్చింది. వేసవిలో సరైన సినిమాలు లేక వెలవెలబోయిన బాక్సాఫీస్‌‌లో ఒక్కసారిగా ఉత్సాహం తీసుకొచ్చింది ‘కల్కి’ మూవీ. ఈ ఏడాది ఇండియా మొత్తాన్ని ఏకం చేసి థియేటర్ల వైపు పరుగులు పెట్టించిన చిత్రమిదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లు కళకళలాడాయి.

‘కల్కి’ తెలుగు సినిమా మరోసారి సగర్వంగా తలెత్తుకునేలా చేసిందనడంలో సందేహం లేదు. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ఓ యువ దర్శకుడిని నమ్మి వైజయంతీ మూవీస్ సంస్థ ఇంత భారీ సినిమాను ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో (దాదాపు రూ.700 కోట్లని అంచనా) రూపొందించడం చిన్న విషయం కాదు.

నాగ్ అశ్విన్ అశ్వినీదత్‌కు అల్లుడే కావచ్చు. అయినా అతడి అనుభవ లేమి గురించి కంగారు పడకుండా ఏమాత్రం రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించడం మామూలు సాహసం కాదు. సినిమాలో విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసి అశ్వినీదత్ మీద అందరికీ గౌరవభావం కలుగుతోంది. దర్శకుడితో పాటు నిర్మాతనూ అదే స్థాయిలో అభినందిస్తున్నారు జనం.

ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు గత కొన్నేళ్లలో తమకు నచ్చని వారి సినిమాలను టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ ఏమో జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీకి ఓపెన్‌గా మద్దతు ప్రకటించారు. ఈ సినిమా నిజానికి గత ఏడాదే రిలీజ్ కావాల్సింది. జగన్ ప్రభుత్వం ఉండగా ‘కల్కి’ రిలీజై ఉంటే మాత్రం అంతే సంగతులు. ఒకవేళ ఏపీలో ప్రభుత్వం మారకపోయి ఉన్నా ‘కల్కి’ టార్గెట్ అయ్యేది. మరి ఈ ప్రమాదం పొంచి ఉన్నా ఇంత భారీ సినిమా తీసి ధైర్యంగా టీడీపీకి మద్దతు పలికి, జగన్‌ను విమర్శించడం గుర్తు చేసుకుని దత్ గట్సే వేరని కొనియాడుతున్నారు నెటిజన్లు.

This post was last modified on June 28, 2024 9:08 pm

Share

Recent Posts

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

3 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

12 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

13 hours ago