ఆన్ లైన్ ప్రపంచంలో అందులోనూ యూట్యూబ్ లాంటి సామజిక మాధ్యమాల ద్వారా పాపులారిటీతో పాటు డబ్బులు రావడం మొదలయ్యాక ఎవరికి వారు రీచ్ పెంచుకుని సెలబ్రిటీలా ఫీలవుతున్న దాఖలాలు నిత్యం చూస్తున్నాం. పాజిటివ్, నెగటివ్ కోణం ఏదైనా సరే ఫాలోయర్స్ ని పెంచుకునే క్రమంలో అధిక శాతం యుట్యూబర్లు ఆధారపడుతున్నది సినిమాల మీదే. అందులోనూ ఒక విభిన్నమైన అప్రోచ్ తో వీడియో రివ్యూలు చెప్పేవాళ్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇటీవలే ఒక యువకుడు కల్కి ట్రైలర్ లోని విజువల్స్ హాలీవుడ్ మూవీస్ ని పోలి ఉన్నాయంటూ ఒక రివ్యూ పోస్ట్ చేశాడు.
ఇది చూసిన విశ్వక్ సేన్ ఇన్స్ టాగ్రామ్ లో స్పందిస్తూ ఇలాంటి వాళ్ళు పరిశ్రమకు చీడపురుగులని, ఒక షార్ట్ ఫిలిం తీసి చూపిస్తే అప్పుడు అతని సత్తా తెలుస్తుందని, పైరసీ కంటే వీళ్ళే ప్రమాదకరంగా మరుతున్నారని సుదీర్ఘమైన మెసేజ్ ఒకటి స్టేటస్ పెట్టాడు. దానికి అవతలి వ్యక్తి కూడా బదులిస్తూ ఒపీనియన్ స్పెల్లింగ్ మీకు రాలేదు కాబట్టి చెప్పకూడదని నేను అనలేదని, గతంలో గుంటూరు కారం టైంలో నిర్మాత నాగవంశీతో చేసిన చర్చ గురించి ప్రస్తావిస్తూ కావాలంటే అలా మాట్లాడుకుందామంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇదంతా చూస్తున్న నెటిజెన్లు రెండు వైపులా మద్దతుగా వ్యతిరేకంగా విడిపోయారు.
తప్పొప్పుల గురించి పక్కనపెడితే కొన్నిసార్లు అటెన్షన్ కోసం వీడియో రివ్యూలు చేసే వాళ్లకు సెలబ్రిటీలు స్పందించడం మొదలుపెడితే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సదరు హీరో చెప్పనిదాంట్లో పాయింట్ ఉందా లేదా అనే దానికన్నా అటు యూట్యూబర్ ఇమేజ్ తో పాటు రీచ్ కూడా పెరిగిపోతుంది. కేవలం ఒక వ్యక్తి చెప్పిన అభిప్రాయాన్ని బట్టి అమాంతం సినిమా కలెక్షన్లు ప్రభావితం చెందటం ఉండదు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఏదీ పట్టించుకోరు. థియేటర్లకు వెళ్ళిపోతారు. ఇది మర్చిపోయి వాదనకు దిగితే మాత్రం లాభం కలిగేది ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్లకే.
This post was last modified on June 19, 2024 11:08 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…