టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు తన తండ్రి సత్యమూర్తి ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో.. తనకు సంగీతం నేర్పిన గురువు మాండలిన్ శ్రీనివాస్ అన్నా కూడా అదే స్థాయిలో గౌరవ మర్యాదలున్నాయి. ఆయన చనిపోయినపుడు దేవి ఎంతగా బాధ పడ్డాడో తెెలిసిందే. వీలు చిక్కినపుడల్లా తన గురువును గుర్తు చేసుకుంటాడు. ఆయన గురించి గొప్పగా మాట్లాడతాడు. తన వంతుగా గురువుకు నివాళి ఇవ్వడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాడు. గతంలో గురు పూజోత్సవం నాడు మాండలిన్ కోసం ఒక పాట కంపోజ్ చేసి రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి తన గురువుకు ట్రిబ్యూట్ ఇచ్చాడు. ఆ క్రమంలో తన చిరకాల కోరికనూ నెరవేర్చుకున్నాడు.
సెప్టెంబరు 19న మాండలిన్ శ్రీనివాస్ వర్ధంతి. ఆయన చనిపోయిన తర్వాతి ఏడాది నుంచి ప్రతిసారీ ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు, దేవిశ్రీ, ఇతర శిష్యులు కలిసి సంగీత కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఐతే ఈసారి కరోనా కారణంగా అలా చేయలేకపోయారు. దీని బదులు మాండలిన్ శ్రీనివాస్ కంపోజ్ చేసిన ఒక ట్రాక్ తీసుకుని.. దానికి దేవిశ్రీ ఆర్కెస్ట్రైజేషన్ చేయడం విశేషం. తాను కంపోజ్ చేసిన ట్యూన్ను తన గురువుతో ప్లే చేయించడం లేదా ఆయన కంపోజ్ చేసిన ట్యూన్కు తాను పాట పాడాలన్నది తన కోరిక అని.. కానీ శ్రీనివాస్ ఉండగా ఆయన్ని అడిగే ధైర్యం చేయలేకపోయానని.. ఐతే ఆయన కంపోజ్ చేసి పెట్టిన ఒక ట్రాక్ ఉందని తన సోదరుడు మాండలిన్ రాజేష్ చెప్పడంతో ఆయన అనుమతితో దాన్ని తీసుకుని తాను ఆర్కెస్ట్రైజేషన్ చేశానని దేవి వివరించాడు. ఆ పాటను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. సంగీత ప్రియుల్ని అది విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీనివాస్ స్థాయికి తగ్గట్లే ఉన్న ఆ ట్రాక్కు దేవిశ్రీ తనదైన శైలిలో ఆర్కెస్ట్రైజేషన్ చేశాడు.
This post was last modified on September 20, 2020 7:29 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…