పవన్ కళ్యాణ్ ఓజి విడుదల వాయిదా పడే విషయంలో మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. ముందు ప్రకటించిన సెప్టెంబర్ 27 రావడం దాదాపు లేనట్టే. నిర్మాత నాగవంశీ తన లక్కీ భాస్కర్ ని అదే డేట్ కి లాక్ చేసుకోవడంతో అనుమానం తీరినట్టయ్యింది. ఒకవేళ అక్టోబర్ 10 కాకుండా దేవరను ముందే తేవాలి అనుకుంటే అప్పుడు ఓజి తేదీని జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చేస్తారు. ఏపీ తెలంగాణ హక్కులు తీసుకునేది నాగవంశీనే కాబట్టి దుల్కర్ సల్మాన్ మూవీని మళ్ళీ జరపడం పెద్ద సమస్య కాదు. ఇదంతా ఒక కొలిక్కి రావాలంటే రెండు మూడు వారాలు పట్టేలా ఉంది. కొంచెం ఓపిక పట్టక తప్పదు.
ఈ నేపథ్యంలో ఓజి దర్శక నిర్మాతలు నిదానమే ప్రధానం సూత్రం పాటించాలని నిర్ణయించుకున్నారట. అదెందుకో చూద్దాం. ఏపీలో పవన్ కళ్యాణ్ గెలుపుతో పాటు కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కొన్నివారాల పాటు పవన్ రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉంటాడు. తను పదవి తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీలోని కీలక వ్యక్తులకు ప్రాధాన్యం దక్కేలా చూసుకోవాల్సిన బాధ్యత తన మీదుంది. పైగా ప్రజలకు జనసేన తరఫున హామీగా నిలబడేది వాళ్లే కాబట్టి ఈ కూర్పు జాగ్రత్తగా జరగాలి. ఆషామాషీగా షూటింగ్ స్పాట్లలో తీసుకునే నిర్ణయాలు కావివి.
అందుకే తొందరపడి పరుగులు పెట్టే బదులు స్లో అండ్ స్టడీ పాటించడమే సుఖమనే నిర్ణయానికి రావడం మంచిదే. ఓజి ఇంకా ఓటిటి డీల్ ఫైనల్ కాలేదనే టాక్ ఉంది. సెప్టెంబర్ ఎలాగూ వదులుకోవాలి కాబట్టి జనవరి దాకా మళ్ళీ స్లాట్లు ఖాళీ లేవు. ఇప్పుడు హడావిడి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ మీద ప్రభావం పడుతుంది. ఈ కారణంగానే దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్యలు అయిష్టంగానే వాయిదా వైపు మొగ్గు చూపారట . ఇదంతా స్పష్టంగా ముందే గుర్తించిన ఏఏం రత్నం తన హరిహర వీరమల్లుని 2024లోనే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఆ మేరకు పనులు కూడా మొదలైపోయాయి.
This post was last modified on June 3, 2024 5:17 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…