ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప’ నుంచి టీం ఒక్కో పాట రిలీజ్ చేస్తోంది. కొన్ని వారాల కిందట ‘పుష్ప పుష్ప…’ అంటూ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. అది బ్యాడ్ సాంగ్ అనలేం కానీ.. ‘పుష్ప’లోని పాటల స్థాయిలో మాత్రం ఇంపాక్ట్ వేయలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాట లాంచ్ చేశారు. ‘సూసేకి..’ అంటూ సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్ గొప్పగా ఆలపించించింది. ఇప్పుడు లేడీ సింగర్స్ ఎందరు ఉన్నా శ్రేయా ఘోషల్ చాలా స్పెషల్ అనడానికి ఈ పాటను రుజువుగా చూపిస్తున్నారు. ఇక ఈ పాటను చంద్రబోస్ చాలా బాగా రాశారు. లిరిక్స్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది.
ఐతే ఎటొచ్చీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విషయంలో మాత్రం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదు. ట్యూన్ విషయంలో దేవి మీద విమర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు లిరికల్ వీడియో రూపకల్పన విషయంలోనూ దేవి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
‘సూసేకి..’ లిరికల్ వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ పేరు ముందు ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ అని వేశారు. దేవి గత ఏడాదే ‘పుష్ప’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికే శ్రేయా ఘోషల్ ఐదుసార్లు జాతీయ అవార్డు గెలిచిన విషయం మరువరాదు. మామూలుగా అయితే ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన పని లేదు కానీ.. దేవి పేరు ముందు అలా వేసుకున్నపుడు శ్రేయాకూ కూడా వేయాల్సిందే కదా అన్న చర్చ నడుస్తోంది.
శ్రేయా సంగతి పక్కన పెడితే.. దేవి జాతీయ అవార్డు గెలవడానికి ముందే ‘నాటు నాటు’ పాటకు ఏకంగా ఆస్కార్ పురస్కారం గెలుచుకున్నారు చంద్రబోస్. కానీ ఆయన పేరు ముందు మాత్రం ఆ ప్రస్తావన లేదు. పైగా లిరికల్ వీడియోలో ఆయన పేరును తప్పుగా ‘చందబోస్’ అని వేశారు. దీంతో ఆల్రెడీ పాట విషయంలో దేవిని తిడుతున్న వాళ్లు.. ఈ విషయాలను కూడా ప్రస్తావించి అతడిని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on May 31, 2024 3:39 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…