మెగా హీరోలలో వరుణ్ తేజ్ ఒక్కడిదీ విభిన్నమైన పంథా. మెగా హీరోలంటే మాస్ డైలాగులు, బ్రేక్ డాన్సులు అనేది ఫాన్స్ నిశ్చితాభిప్రాయం. కానీ వరుణ్ తేజ్ అవేమీ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఒకే మూసలో పడిపోకుండా అన్ని రకాల పాత్రలు, సినిమాలు చేస్తున్నాడు. మెగా హీరోలందరిలోను తను ప్రత్యేకమని అనిపించుకున్నాడు.
ఇప్పుడు మరో మెగా హీరో కూడా అదే దారిలో వెళుతున్నాడు. చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇమేజ్ తెచ్చే పాత్రల కోసం చూడడం లేదు. సగటు కుర్రాడిని తలపించే పాత్రలే ఏరి కోరి ఎంచుకుంటున్నాడు. మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే క్రిష్తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ సినిమాలా కాకుండా ఆర్ట్ ఫిలిం తరహాలో వుంటుందని అంటున్నారు. వరుణ్ కూడా రెండవ సినిమా కంచె క్రిష్ డైరెక్షన్లోనే చేసాడు.
ఆ సినిమాతోనే అతనికి హీరోగా ఐడెంటిటీ వచ్చింది. అక్కడ్నుంచీ అన్నీ విభిన్నమైన సినిమాలే ఎంచుకుంటూ వెళ్లాడు. మాస్ సినిమాలు చేసి, చేసి ఒకానొక దశలో కెరీర్ ప్రమాదంలో పడిన తన అన్నయ్య సాయి ధరమ్ తేజ్ అనుభవంతో ఈ ట్రెండ్లో మాస్ సినిమాలు కరక్ట్ కాదని ఈ యువ హీరో ముందే పసిగట్టేసాడు. ఓటిటి జమానాలో ప్రయోగాలకు ఫుల్ డిమాండ్ ఇప్పుడు.
This post was last modified on September 23, 2020 3:02 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…