గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ కోసం తమిళ స్టార్ హీరో అజిత్ హైదరాబాద్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ తనకు దగ్గరగా షూటింగ్ జరుగుతున్న విశ్వంభర సెట్ కు వెళ్లి చిరంజీవిని కలిశాడు. ఇందులో పెద్ద విశేషం ఏముందనుకుంటే పొరపాటే. కారణం ఈ కలయిక కనీసం ఇలా ఫోటో రూపంలో జరిగి ముప్పై ఒక్క ఏళ్లయ్యిందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 1993లో అజిత్ అమరావతి అనే కోలీవుడ్ మూవీతో డెబ్యూ చేశాడు. దీనికన్నా ఏడాది ముందు తెలుగులో ప్రేమ పుస్తకం సినిమా ఒప్పుకున్నాడు. ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు అబ్బాయి శ్రీనివాస్ దర్శకుడు.
షూటింగ్ కొంత భాగం అయ్యాక వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతుండగా నీటి ప్రమాదంలో శ్రీనివాస్ హఠాన్మరణం చెందారు. మిగిలిన సినిమాను పుత్రశోకాన్ని దిగమింగుకుని మారుతీరావు గారు పూర్తి చేశారు. ఆడియో లాంచ్ కి చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేసి టీమ్ ని ఆశీర్వదించారు. అప్పటికే ఆయన మెగాస్టార్ కాగా అజిత్ ఇంకా తను సెటిలయ్యేది తమిళమా తెలుగానే అయోమయంలో ఉన్నాడు. దురదృష్టవశాత్తు ప్రేమ పుస్తకం ఫ్లాప్ అయ్యింది. ఇంకోవైపు కోలీవుడ్ అజిత్ కి హిట్లతో స్వాగతం పలికింది. కట్ చేస్తే అప్పుడు చెన్నై వెళ్లిన తలా మళ్ళీ తిరిగి వచ్చే అవసరం ఎప్పుడూ పడలేదు.
ఇదంతా జరిగి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అజిత్ పక్కరాష్ట్రంలో తిరుగు లేని స్టార్ డం అందుకున్నాడు. విజయ్ రూపంలో పెద్ద పోటీ ఉన్నా తట్టుకుని మరీ తనదైన ఫ్యాన్ డంని సృష్టించుకున్నాడు. నిరాడంబరతకు మారుపేరుగా చెప్పుకునే అజిత్ ఇంత గ్యాప్ తర్వాత ఒక తెలుగు నిర్మాణ సంస్థ(మైత్రి)కు సినిమా చేయడం, అది భాగ్యనగరంలో జరుగుతుంటే చిరుని కలుసుకోవడం తీపి జ్ఞాపకంగా అభిమానులు నెమరువేసుకుంటున్నారు. ఇదంతా ఓకే కానీ ఈ ఇద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ వస్తే బాగుంటుంది కదూ. కొన్ని ఊహలకే పరిమితమవుతాయి తప్ప నిజం కావడం అసాధ్యమే.
This post was last modified on May 29, 2024 5:13 pm
ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన…
కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి ఋజువు చేస్తే తాజాగా కోర్ట్…
మే 9 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి మీదే ఎక్కువ ప్రేముందనేది బహిరంగ…
విడుదలై నెలరోజులు దాటుతున్నా ఛావా పరుగులు ఆగడం లేదు. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు విక్కీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో……
ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా…