గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ కోసం తమిళ స్టార్ హీరో అజిత్ హైదరాబాద్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ తనకు దగ్గరగా షూటింగ్ జరుగుతున్న విశ్వంభర సెట్ కు వెళ్లి చిరంజీవిని కలిశాడు. ఇందులో పెద్ద విశేషం ఏముందనుకుంటే పొరపాటే. కారణం ఈ కలయిక కనీసం ఇలా ఫోటో రూపంలో జరిగి ముప్పై ఒక్క ఏళ్లయ్యిందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 1993లో అజిత్ అమరావతి అనే కోలీవుడ్ మూవీతో డెబ్యూ చేశాడు. దీనికన్నా ఏడాది ముందు తెలుగులో ప్రేమ పుస్తకం సినిమా ఒప్పుకున్నాడు. ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు అబ్బాయి శ్రీనివాస్ దర్శకుడు.
షూటింగ్ కొంత భాగం అయ్యాక వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతుండగా నీటి ప్రమాదంలో శ్రీనివాస్ హఠాన్మరణం చెందారు. మిగిలిన సినిమాను పుత్రశోకాన్ని దిగమింగుకుని మారుతీరావు గారు పూర్తి చేశారు. ఆడియో లాంచ్ కి చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేసి టీమ్ ని ఆశీర్వదించారు. అప్పటికే ఆయన మెగాస్టార్ కాగా అజిత్ ఇంకా తను సెటిలయ్యేది తమిళమా తెలుగానే అయోమయంలో ఉన్నాడు. దురదృష్టవశాత్తు ప్రేమ పుస్తకం ఫ్లాప్ అయ్యింది. ఇంకోవైపు కోలీవుడ్ అజిత్ కి హిట్లతో స్వాగతం పలికింది. కట్ చేస్తే అప్పుడు చెన్నై వెళ్లిన తలా మళ్ళీ తిరిగి వచ్చే అవసరం ఎప్పుడూ పడలేదు.
ఇదంతా జరిగి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అజిత్ పక్కరాష్ట్రంలో తిరుగు లేని స్టార్ డం అందుకున్నాడు. విజయ్ రూపంలో పెద్ద పోటీ ఉన్నా తట్టుకుని మరీ తనదైన ఫ్యాన్ డంని సృష్టించుకున్నాడు. నిరాడంబరతకు మారుపేరుగా చెప్పుకునే అజిత్ ఇంత గ్యాప్ తర్వాత ఒక తెలుగు నిర్మాణ సంస్థ(మైత్రి)కు సినిమా చేయడం, అది భాగ్యనగరంలో జరుగుతుంటే చిరుని కలుసుకోవడం తీపి జ్ఞాపకంగా అభిమానులు నెమరువేసుకుంటున్నారు. ఇదంతా ఓకే కానీ ఈ ఇద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ వస్తే బాగుంటుంది కదూ. కొన్ని ఊహలకే పరిమితమవుతాయి తప్ప నిజం కావడం అసాధ్యమే.
This post was last modified on May 29, 2024 5:13 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…