గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ కోసం తమిళ స్టార్ హీరో అజిత్ హైదరాబాద్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ తనకు దగ్గరగా షూటింగ్ జరుగుతున్న విశ్వంభర సెట్ కు వెళ్లి చిరంజీవిని కలిశాడు. ఇందులో పెద్ద విశేషం ఏముందనుకుంటే పొరపాటే. కారణం ఈ కలయిక కనీసం ఇలా ఫోటో రూపంలో జరిగి ముప్పై ఒక్క ఏళ్లయ్యిందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 1993లో అజిత్ అమరావతి అనే కోలీవుడ్ మూవీతో డెబ్యూ చేశాడు. దీనికన్నా ఏడాది ముందు తెలుగులో ప్రేమ పుస్తకం సినిమా ఒప్పుకున్నాడు. ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు అబ్బాయి శ్రీనివాస్ దర్శకుడు.
షూటింగ్ కొంత భాగం అయ్యాక వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతుండగా నీటి ప్రమాదంలో శ్రీనివాస్ హఠాన్మరణం చెందారు. మిగిలిన సినిమాను పుత్రశోకాన్ని దిగమింగుకుని మారుతీరావు గారు పూర్తి చేశారు. ఆడియో లాంచ్ కి చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేసి టీమ్ ని ఆశీర్వదించారు. అప్పటికే ఆయన మెగాస్టార్ కాగా అజిత్ ఇంకా తను సెటిలయ్యేది తమిళమా తెలుగానే అయోమయంలో ఉన్నాడు. దురదృష్టవశాత్తు ప్రేమ పుస్తకం ఫ్లాప్ అయ్యింది. ఇంకోవైపు కోలీవుడ్ అజిత్ కి హిట్లతో స్వాగతం పలికింది. కట్ చేస్తే అప్పుడు చెన్నై వెళ్లిన తలా మళ్ళీ తిరిగి వచ్చే అవసరం ఎప్పుడూ పడలేదు.
ఇదంతా జరిగి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అజిత్ పక్కరాష్ట్రంలో తిరుగు లేని స్టార్ డం అందుకున్నాడు. విజయ్ రూపంలో పెద్ద పోటీ ఉన్నా తట్టుకుని మరీ తనదైన ఫ్యాన్ డంని సృష్టించుకున్నాడు. నిరాడంబరతకు మారుపేరుగా చెప్పుకునే అజిత్ ఇంత గ్యాప్ తర్వాత ఒక తెలుగు నిర్మాణ సంస్థ(మైత్రి)కు సినిమా చేయడం, అది భాగ్యనగరంలో జరుగుతుంటే చిరుని కలుసుకోవడం తీపి జ్ఞాపకంగా అభిమానులు నెమరువేసుకుంటున్నారు. ఇదంతా ఓకే కానీ ఈ ఇద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ వస్తే బాగుంటుంది కదూ. కొన్ని ఊహలకే పరిమితమవుతాయి తప్ప నిజం కావడం అసాధ్యమే.
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…