టాలీవుడ్ లో మరే హీరోయిన్ ఎదుర్కొని చిత్రమైన పరిస్థితిని రకుల్ ప్రీత్ సింగ్ ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్.. తదనంతరం రియా చక్రవర్తి ఎపిసోడ్.. డ్రగ్స్ వినియోగం లాంటి ఇష్యూలోకి రకుల్ పేరు అనూహ్యంగా వినిపించటం తెలిసిందే. దీంతో.. రియాక్టు అయిన ఆమె.. తన పేరును అనవసరంగా లాగుతున్నారని.. మీడియాలో తన పేరును బద్నాం చేస్తున్నట్లుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అక్కడితో ఆగని ఆమె.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వాటికి చెక్ చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తమ వైఖరిని వెల్లడించాలని కోరుతూ.. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు.. ప్రసారభారతికి.. ప్రెస్ కౌన్సెల్ కు.. న్యూస్ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ కు నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదిస్తూ.. రకుల్ కోరుకున్నట్లుగా ఇంజంక్షన్.. బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. కోర్టుకు వచ్చే ముందు ఆమె ప్రభుత్వానికి కానీ.. సంబంధించిన వర్గాల వారికి కానీ ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. ఏ ఒక్క మీడియా హౌస్ కానీ.. చానల్ గురించి కానీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన రకుల్ న్యాయవాది తన వాదనల్ని వినిపిస్తూ.. రియా చక్రవర్తి తాను రకుల్ పేరు చెప్పలేదని చెప్పిన తర్వాత కూడా.. తన క్లయింట్ పేరును డ్రగ్స్ కేసుతో లింక్ చేస్తూ రాస్తున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి నోటీసులు జారీ చేయటంతో పాటు.. ఈ పిటిషన్ పై విచారణను అక్టోబరు 15కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటిలోపు మరెన్ని పరిణామాలు చొటు చేసుకుంటాయో చూడాలి.
This post was last modified on September 18, 2020 3:48 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…