జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర పాటల సందడి మొదలైపోయింది. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చిన టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది మల్టీ స్టారర్ కావడంతో సోలో హీరోగా తారక్ ని చూసేందుకు అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఇంత కాలం పట్టడంతో ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. భయం థీమ్ తో వచ్చిన ఈ లిరికల్ వీడియోని రేపు జూనియర్ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ కానుక ఇచ్చారు.
తన ట్రెండ్ ఫాలో అవుతూ అనిరుద్ ఇందులో కూడా పాట పాడుతూ కనిపించాడు. సముద్రపు ఒడ్డున శత్రువులను ఊచకోత కొస్తున్న దేవర ని చూపిస్తూనే ఇంకోవైపు అతని జోలికి వస్తే జాగ్రత్త అంటూ హెచ్చరిక జారీ చేస్తూ పోటెత్తే అలల ప్రవాహాన్ని దేవరలో ఆవేశానికి ముడిపెట్టారు. వాయిద్యాల హోరు ఎక్కువగా ఉండటం వల్ల లిరిక్స్ అర్థం చేసుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది. ఫ్యాన్స్ కోరుకున్న ఎలివేషన్లు, ఎమోషన్లు అన్నీ పండాయి కానీ మళ్ళీ మళ్ళీ వినేలా ఉందో లేదో ఓ రెండు మూడు రోజులు ఆగితే అర్థమైపోతుంది. కొరటాల మేకింగ్ వయోలెంట్ గా ఉంది.
రామజోగయ్య శాస్త్రి దేవర వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు బాగుంది. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో జరిగే సీరియస్ కథే అయినప్పటికీ అనిరుద్ కంపోజింగ్ మాస్ తో క్లాస్ టచ్ వచ్చేలా పాశ్చాత్య టచ్ ఇవ్వడం వెరైటీగా ఉంది. విజువల్స్ ద్వారా సినిమాలో కంటెంట్ ఎంత వయొలెంట్ గా ఉండబోతోందో క్లూస్ ఇచ్చారు. టీజర్ కాదు కాబట్టి క్యాస్టింగ్ రివీల్ చేయకుండా కేవలం దేవరని పరిచయం చేయడానికి ఈ పాటని వాడుకున్నారు. నాగవంశీ, విశ్వక్ సేన్ లాంటి వాళ్ళు ఊరించినట్టు ఇది హుకుంని మించిపోయేలా నిలుస్తుందో లేదో కొంత కాలం వేచి చూడాలి. అనిరుద్ సాంగ్స్ స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కుతాయి మరి.
This post was last modified on May 19, 2024 8:24 pm
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…