నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ ప్రత్యేకంగా అనిపించని వైనం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది. రెగ్యులర్ గా సినిమాలు చూసే మూవీ లవర్స్ సైతం ఏదేదో ఊహించుకున్నామని, కానీ ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్ నే వాడి దానికి సంజయ్ దత్ విలనిజం జోడించడం తప్ప ఇంకేమి అనిపించలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్ కంటెంట్ పరంగా పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని, ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. మెజారిటీ మాత్రం మొదటి క్యాటగిరీనే.
ఇవన్నీ దర్శకుడు పూరి జగన్నాథ్ గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే తరువాత ప్లాన్ చేయబోయే ప్రమోషన్లకు ఇవి చాలా కీలకం. ఇప్పటికీ లైగర్ డిజాస్టర్ ప్రభావం ఆయన మీద మార్కెట్ పరంగా బలంగా ఉంది. దాన్నుంచి బయటపడేందుకు డబుల్ ఇస్మార్ట్ ని ఆయుధంగా వాడుతున్నారు. ఇది పని చేయాలంటే ఆడియన్స్ లో ఈ మూవీ పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగేలా చూసుకోవాలి. అంతే తప్ప దిమాక్ ఖరాబ్ లాంటి ట్రెండీ పదాలతో మళ్ళీ పని జరగాలంటే కుదరకపోవచ్చు. ఇంకోవైపు ట్రోలింగ్ చేస్తున్న బ్యాచులు లేకపోలేదు. ప్రతిదీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ బజ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గత కొంత కాలంగా చూస్తున్నాం. దీన్ని బిల్డ్ చేసుకోవడంలో ఏ మాత్రం తడబడినా ఆ ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడుతుంది. ది ఫ్యామిలీ స్టార్ మంచి ఉదాహరణ. డబుల్ ఇస్మార్ట్ లో బోలెడు విషయాలు ఉండొచ్చు. ట్రైలర్ కోసం కొన్నింటిని దాచి ఉండొచ్చు. కానీ అంచనాలు పెంచే క్రమం మాత్రం పద్దతి ప్రకారం ఉండాలి. మణిశర్మ పాటలు బజ్ విషయంలో కీలకం కాబోతున్నాయి. మొదటి భాగం విజయంలో ఈయన పాత్రను విస్మరించలేం. సో వచ్చిన ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగానే పూరి ఎలాంటి స్ట్రాటజీ రాసుకుంటాడో చూడాలి.
This post was last modified on May 16, 2024 11:57 am
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…