నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ ప్రత్యేకంగా అనిపించని వైనం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది. రెగ్యులర్ గా సినిమాలు చూసే మూవీ లవర్స్ సైతం ఏదేదో ఊహించుకున్నామని, కానీ ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్ నే వాడి దానికి సంజయ్ దత్ విలనిజం జోడించడం తప్ప ఇంకేమి అనిపించలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్ కంటెంట్ పరంగా పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని, ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. మెజారిటీ మాత్రం మొదటి క్యాటగిరీనే.
ఇవన్నీ దర్శకుడు పూరి జగన్నాథ్ గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే తరువాత ప్లాన్ చేయబోయే ప్రమోషన్లకు ఇవి చాలా కీలకం. ఇప్పటికీ లైగర్ డిజాస్టర్ ప్రభావం ఆయన మీద మార్కెట్ పరంగా బలంగా ఉంది. దాన్నుంచి బయటపడేందుకు డబుల్ ఇస్మార్ట్ ని ఆయుధంగా వాడుతున్నారు. ఇది పని చేయాలంటే ఆడియన్స్ లో ఈ మూవీ పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగేలా చూసుకోవాలి. అంతే తప్ప దిమాక్ ఖరాబ్ లాంటి ట్రెండీ పదాలతో మళ్ళీ పని జరగాలంటే కుదరకపోవచ్చు. ఇంకోవైపు ట్రోలింగ్ చేస్తున్న బ్యాచులు లేకపోలేదు. ప్రతిదీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ బజ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గత కొంత కాలంగా చూస్తున్నాం. దీన్ని బిల్డ్ చేసుకోవడంలో ఏ మాత్రం తడబడినా ఆ ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడుతుంది. ది ఫ్యామిలీ స్టార్ మంచి ఉదాహరణ. డబుల్ ఇస్మార్ట్ లో బోలెడు విషయాలు ఉండొచ్చు. ట్రైలర్ కోసం కొన్నింటిని దాచి ఉండొచ్చు. కానీ అంచనాలు పెంచే క్రమం మాత్రం పద్దతి ప్రకారం ఉండాలి. మణిశర్మ పాటలు బజ్ విషయంలో కీలకం కాబోతున్నాయి. మొదటి భాగం విజయంలో ఈయన పాత్రను విస్మరించలేం. సో వచ్చిన ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగానే పూరి ఎలాంటి స్ట్రాటజీ రాసుకుంటాడో చూడాలి.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…