ఈ టెక్ జమానాలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలకు నానాటికీ ఆదరణ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా రాకతో ఓటీటీకి ఉన్న ఆదరణ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రంగంపై పూర్తి స్థాయిలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈనాడు కూడా పూర్తి స్థాయిలో ఓటీటీ రంగంలో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోందని టాక్ వస్తోంది. అపుడెపుడో అనుకోకుండా సినిమాల కాపీ రైట్స్ 99 ఏళ్లపాటు రాయించుకోవాలన్న రామోజీ ఆలోచన నేడు ఆయనకు ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతోంది. ఆనాడు చేసిన పని ఈనాడు రామోజీ రావుకు కలిసొచ్చింది. ఈటీవీ లో ప్రసారం చేసేందుకు సినిమాల రైట్స్ కొనుక్కున్న రామోజీరావుకు నేడు ఆ కాపీ రైట్స్ కాసులు కురిపించబోతున్నాయి.
వాస్తవానికి ఇప్పటికే రామోజీరావు పాక్షికంగా ఓటీటీలో అడుగుపెట్టారు. ఈనాడుకు చెందిన ఈటీవి విన్ లో ఈటీవీ రైట్స్ ఉన్న సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. దాదాపు తెలుగు ఓటీటీలన్నింటికీ ఈటీవీ విన్ పోటీనిస్తోంది. అయితే, భవిష్యత్తులో ఓటీటీ రంగంలో తిరుగులేకుండా ఎదిగేందుకు రామోజీ పావులు కదుపుతున్నారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సినిమాలు ఈటీవీలో మాత్రమే ప్రసారమవుతాయి. ఇక, వాటితోపాటు ఈటీవీ ప్రారంభించిన కొత్తల్లో ఒకేసారి 99 ఏళ్ళపాటు లీజుకు తీసుకున్న వేలాది సినిమాల హక్కులు కూడా వేరేవరి దగ్గర లేవు. ఈ రెండు అంశాలు ఈనాడు లాంచ్ చేయబతోన్న ఓటీటీకి కొండంత బలం అని చెప్పవచ్చు. దీంతో, తమ ఓటీటీలో ఆ సినిమాలన్నీ స్ట్రీమింగ్ చేయాలని రామోజీరావు భావిస్తున్నారట. దీంతోపాటు, త్వరలో విడుదల కాబోతోన్న కొత్త సినిమాలు కూడా కొనేందుకు రామోజీరావు ప్లాన్ చేస్తున్నారట. ఓటీటీలో స్ట్రీమింగ్ తో పాటు ఈటీవీలో కూడా ప్రసారం అయ్యేలా సినిమాల్నీ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఏదైతేనేం..ఈనాడు అరంగేట్రంతో ఓటీటీ తెలుగు విస్తృతి పెరగడం ఖాయమని చెప్పవచ్చు.
This post was last modified on September 17, 2020 11:10 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…