ఒకప్పుడు వయసుతో సంబంధం లేకుండా హీరోలు తండ్రులు తాతలుగా నటించేవాళ్ళు. ఆడియన్స్ అంగీకరించేవారు. చిరంజీవి తొలినాళ్ళలోనే సింహపురి సింహం చేయడానికి కారణం ఇదే. సర్గీయ ఎన్టీఆర్ కు ఈ క్యాటగిరీలో భారీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వెంకటేష్ కు సూర్యవంశం లాంటి హిట్లున్నాయి. అయితే కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల ఈ ఫాదర్ సన్ డ్యూయల్ రోల్ ఫార్ములా అంతగా వర్కౌట్ కావడం లేదు. అలాంటి కథలు రాసేవాళ్ళు తగ్గిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆంధ్రావాలాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా చూసేందుకే అభిమానులు ఇష్టపడలేదు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే విజయ్ దేవరకొండ ఇప్పుడీ రిస్క్ చేయడానికి సిద్ధపడుతున్నట్టు టాలీవుడ్ టాక్. రాహుల్ సంకృత్యాయాన్ దర్శకత్వంలో రూపొందబోయే పీరియాడిక్ డ్రామాలో రౌడీ హీరో తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఒకే ఫ్రేమ్ లో రెండు పాత్రలుగా కనిపిస్తాడా లేక శ్యామ్ సింగ రాయ్ లో ఇద్దరు నానిలను వేర్వేరుగా చూపించినట్టు రాహుల్ ఇందులో కూడా ఏమైనా ప్రయోగం చేస్తాడా అనేది వేచి చూడాలి. నెరసిన జుట్టు విజయ్ దేవరకొండలకు అంతగా నప్పదు. ఒకవేళ ఏదైనా ట్విస్టు పెట్టి రెండు రకాలుగా చూపిస్తాడేమో వేచి చూడాలి.
ది ఫ్యామిలి స్టార్ సూపర్ ఫ్లాప్ కి షాక్ తిన్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ప్రామిసింగ్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న గౌతమ్ తిన్ననూరి ప్యాన్ ఇండియా మూవీ మీద మాములు అంచనాలు లేవు. రవికిరణ్ కోలాతో దిల్ రాజు నిర్మించబోయే చిత్రం కూడా డిఫరెంట్ జానరే. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్న రౌడీ హీరోకి ఈ మూడు సినిమాలు చాలా కీలకం. అందుకే తొందపరపడకుండా ఎంత ఆలస్యమైనా సరే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఇంకో విడుదల ఉండకపోవచ్చు. గౌతమ్ సినిమా 2025 వేసవికి ప్లాన్ చేస్తున్నారు సితార మేకర్స్.
This post was last modified on May 11, 2024 2:09 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…