ఒకప్పుడు వయసుతో సంబంధం లేకుండా హీరోలు తండ్రులు తాతలుగా నటించేవాళ్ళు. ఆడియన్స్ అంగీకరించేవారు. చిరంజీవి తొలినాళ్ళలోనే సింహపురి సింహం చేయడానికి కారణం ఇదే. సర్గీయ ఎన్టీఆర్ కు ఈ క్యాటగిరీలో భారీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వెంకటేష్ కు సూర్యవంశం లాంటి హిట్లున్నాయి. అయితే కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల ఈ ఫాదర్ సన్ డ్యూయల్ రోల్ ఫార్ములా అంతగా వర్కౌట్ కావడం లేదు. అలాంటి కథలు రాసేవాళ్ళు తగ్గిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆంధ్రావాలాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా చూసేందుకే అభిమానులు ఇష్టపడలేదు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే విజయ్ దేవరకొండ ఇప్పుడీ రిస్క్ చేయడానికి సిద్ధపడుతున్నట్టు టాలీవుడ్ టాక్. రాహుల్ సంకృత్యాయాన్ దర్శకత్వంలో రూపొందబోయే పీరియాడిక్ డ్రామాలో రౌడీ హీరో తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఒకే ఫ్రేమ్ లో రెండు పాత్రలుగా కనిపిస్తాడా లేక శ్యామ్ సింగ రాయ్ లో ఇద్దరు నానిలను వేర్వేరుగా చూపించినట్టు రాహుల్ ఇందులో కూడా ఏమైనా ప్రయోగం చేస్తాడా అనేది వేచి చూడాలి. నెరసిన జుట్టు విజయ్ దేవరకొండలకు అంతగా నప్పదు. ఒకవేళ ఏదైనా ట్విస్టు పెట్టి రెండు రకాలుగా చూపిస్తాడేమో వేచి చూడాలి.
ది ఫ్యామిలి స్టార్ సూపర్ ఫ్లాప్ కి షాక్ తిన్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ప్రామిసింగ్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న గౌతమ్ తిన్ననూరి ప్యాన్ ఇండియా మూవీ మీద మాములు అంచనాలు లేవు. రవికిరణ్ కోలాతో దిల్ రాజు నిర్మించబోయే చిత్రం కూడా డిఫరెంట్ జానరే. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్న రౌడీ హీరోకి ఈ మూడు సినిమాలు చాలా కీలకం. అందుకే తొందపరపడకుండా ఎంత ఆలస్యమైనా సరే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఇంకో విడుదల ఉండకపోవచ్చు. గౌతమ్ సినిమా 2025 వేసవికి ప్లాన్ చేస్తున్నారు సితార మేకర్స్.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…