ఒకప్పుడు వయసుతో సంబంధం లేకుండా హీరోలు తండ్రులు తాతలుగా నటించేవాళ్ళు. ఆడియన్స్ అంగీకరించేవారు. చిరంజీవి తొలినాళ్ళలోనే సింహపురి సింహం చేయడానికి కారణం ఇదే. సర్గీయ ఎన్టీఆర్ కు ఈ క్యాటగిరీలో భారీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వెంకటేష్ కు సూర్యవంశం లాంటి హిట్లున్నాయి. అయితే కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల ఈ ఫాదర్ సన్ డ్యూయల్ రోల్ ఫార్ములా అంతగా వర్కౌట్ కావడం లేదు. అలాంటి కథలు రాసేవాళ్ళు తగ్గిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆంధ్రావాలాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా చూసేందుకే అభిమానులు ఇష్టపడలేదు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే విజయ్ దేవరకొండ ఇప్పుడీ రిస్క్ చేయడానికి సిద్ధపడుతున్నట్టు టాలీవుడ్ టాక్. రాహుల్ సంకృత్యాయాన్ దర్శకత్వంలో రూపొందబోయే పీరియాడిక్ డ్రామాలో రౌడీ హీరో తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఒకే ఫ్రేమ్ లో రెండు పాత్రలుగా కనిపిస్తాడా లేక శ్యామ్ సింగ రాయ్ లో ఇద్దరు నానిలను వేర్వేరుగా చూపించినట్టు రాహుల్ ఇందులో కూడా ఏమైనా ప్రయోగం చేస్తాడా అనేది వేచి చూడాలి. నెరసిన జుట్టు విజయ్ దేవరకొండలకు అంతగా నప్పదు. ఒకవేళ ఏదైనా ట్విస్టు పెట్టి రెండు రకాలుగా చూపిస్తాడేమో వేచి చూడాలి.
ది ఫ్యామిలి స్టార్ సూపర్ ఫ్లాప్ కి షాక్ తిన్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ప్రామిసింగ్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న గౌతమ్ తిన్ననూరి ప్యాన్ ఇండియా మూవీ మీద మాములు అంచనాలు లేవు. రవికిరణ్ కోలాతో దిల్ రాజు నిర్మించబోయే చిత్రం కూడా డిఫరెంట్ జానరే. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్న రౌడీ హీరోకి ఈ మూడు సినిమాలు చాలా కీలకం. అందుకే తొందపరపడకుండా ఎంత ఆలస్యమైనా సరే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఇంకో విడుదల ఉండకపోవచ్చు. గౌతమ్ సినిమా 2025 వేసవికి ప్లాన్ చేస్తున్నారు సితార మేకర్స్.
This post was last modified on May 11, 2024 2:09 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…