Hero Venkatesh
ఈ ఏడాది సంక్రాంతికి ‘సైంధవ్’తో గట్టి ఎదురు దెబ్బే తిన్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకీ 75వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో వెంకీ కొంచెం డీలా పడి గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడాయన తనతో ‘ఎఫ్-2’; ‘ఎఫ్-3’ సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, దిల్ రాజులతో మళ్లీ జట్టు కట్టబోతున్నారు. ఈ సినిమా గురించి కొన్ని రోజుల ముందే అనౌన్స్మెంట్ వచ్చింది. త్వరలోనే చిత్రీకరణ కూడా మొదలు కాబోతోంది.
ఈ సినిమాకు ఒక ఆసక్తికర టైటిల్ పెట్టినట్లు తాజా సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది ఈ సినిమా పేరట. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న విషయాన్ని ముందే ప్రకటించారు. ఇప్పుడు టైటిల్ కూడా దానికి రిలేట్ అయ్యేలానే పెడుతున్నారట.
మామూలుగా అక్కినేని నాగార్జున సంక్రాంతికి సినిమాలను షెడ్యూల్ చేసి.. సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నాం అని చెబుతుంటారు. ఐతే ఇప్పుడు సినిమాకు టైటిల్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెడుతుండడం విశేషమే. ఇలాంటి టైటిల్ పెట్టి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తే పబ్లిసిటీ పరంగా బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. ఫ్యామిలీస్ను బాగా ఆకర్షించే టైటిల్ అవుతుందిది. ‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’లతో పోలిస్తే ఈ సినిమా డిఫరెంటుగా ఉంటుందని అనౌన్స్మెంట్ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఇందులో వెంకీ సరసన ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారు. అందులో ఒక కథానాయికగా మీనాక్షి చౌదరి ఓకే అయింది. ఇంకో హీరోయిన్ కోసం వేట సాగుతోంది. ‘బలగం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. జూన్ లేదా జులైలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.
This post was last modified on May 11, 2024 1:43 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…