మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు రాణిగారుతో కిరణ్ అబ్బవరంకు మంచి డెబ్యూ ఇచ్చిన దర్శకుడు రవికిరణ్ కోలా త్వరలో విజయ్ దేవరకొండతో జట్టు కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. పూర్తి వివరాలు రౌడీ హీరో బర్త్ డే మే 9 అనౌన్స్ మెంట్ రాబోతోంది. రవికిరణ్ కోలా మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ కాదు. పల్లెటూరి నేపథ్యంలో ఒక చిన్న ప్రేమకథను వినోదాత్మకంగా చెప్పాడు. కమర్షియల్ ఫలితం పక్కనపెడితే తనలో టెక్నీషియన్ ప్రపంచానికి పరిచయమయ్యాడు.
ఇప్పుడు రవికిరణ్ కోలాకు పలు సవాళ్లున్నాయి. మొదటిది విజయ్ దేవరకొండను విజయాల ట్రాక్ ఎక్కించడం. గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక సతమవుతున్న రౌడీ హీరోకి ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తీవ్రంగా నిరాశ పరిచింది. ఖుషి వసూళ్లు ఓకే కానీ కంటెంట్ కి పూర్తి స్థాయి మెప్పులు దక్కలేదు. ఇక లైగర్ సంగతి సరేసరి. ఇప్పటికీ పూరి జగన్నాధ్ దాని వల్ల జరిగిన డ్యామేజ్ ని సరిచేసుకుంటూనే ఉన్నాడు. ఆ మాటకొస్తే విజయ్ దేవరకొండకు గీత గోవిందం తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్టు పడలేదు. ముందు ఆ బాధ్యత గౌతమ్ తిన్ననూరి మీద ఉంది కానీ ఇప్పుడు రవికిరణ్ కోలా కూడా పంచుకోవాలి.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మాములు యువకుడు వ్యవస్థని శాశించే స్థాయికి ఎలా చేరుకున్నాడనే పాయింట్ మీద రవికిరణ్ కొత్త తరహా ట్రీట్మెంట్ రాసుకున్నాడట. లైన్ వినడానికి మాములుగా అనిపించినా ఊహకందని మలుపులతో విభిన్న ప్రయత్నమనే లీక్ అయితే వస్తోంది. రవికిరణ్ ముందున్న ఇంకో ఛాలెంజ్ దిల్ రాజు నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఇది సరిగ్గా చేయగలిగితే మంచి భవిష్యత్తు పక్కా. అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్ తరహా గ్యారెంటీ కెరీర్ దక్కుతుంది. సో వీలైనంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇతర దర్శకుల మాదిరి పొరపాట్లకు తావివ్వకపోతే చాలు. సెటిలైపోవచ్చు.
This post was last modified on May 4, 2024 12:34 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…