బాలీవుడ్లోని బంధుప్రీతి, ఇతర దాష్టీకాలపై దండెత్తుతోన్న కంగన రనౌత్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ‘తిన్న కంచంలోనే కక్కే రకం’ అంటూ రాజ్యసభ సభ్యురాలు, అమితాబ్ భార్య జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలతో కంగన శివాలెత్తుతోంది. తన కంచంలో ఎవరూ వడ్డించలేదని, తన ‘తాలీ’ (భోజనం) తానే తయారు చేసుకున్నానని, తనకు మొదట్లో బాలీవుడ్ పెట్టిన భోజనంలో ఒక రెండు నిమిషాల క్యారెక్టర్, ఒక ఐటెమ్ సాంగ్ వుండేవని, అది కూడా హీరోతో పడుకుంటేనే ఆ మాత్రం దక్కేదని కంగన ఘాటుగా స్పందించింది.
అయినా తన కూతురికి టీనేజీలో బాలీవుడ్లో ఇవే కష్టాలు వచ్చినా, తన కొడుకు కూడా అష్టకష్టాలు పడి ఉరి వేసుకుని చనిపోయినా జయ ఇలా మాట్లాడేవారా అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. జనరల్గా కంగనకు ఎదురు మాట్లాడ్డానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే ఒక్కసారి ఆమెకు ఎదురు మాట్లాడగానే కంగన ఇలాగే స్పందిస్తూ వుంటుంది.
తేనెతుట్టెను కదపడం దేనికన్నట్టు ఆమె తమపైనే వ్యాఖ్యలు చేసినా కానీ స్పందించకుండా గమ్మున వుండిపోతుంటారు. అయితే బాలీవుడ్పై మీడియా చేస్తోన్న ప్రచారంతో జయ స్పందించి కంగన లాంటి ఇండస్ట్రీ మనుషులే మీడియాకు సినిమా వాళ్లను చులకన చేస్తున్నారని ఆమె పేరెత్తకుండానే ఆమె మాట్లాడారు. దానికి కంగన ఈ రేంజ్లో రివర్స్ ఎటాక్ చేసింది.
This post was last modified on September 16, 2020 10:07 pm
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…