Movie News

సుధీర్ బాబుతో తలపడుతున్న ఆనంద్ దేవరకొండ

ఏదైనా డేట్ ఖాళీగా ఉండటం ఆలస్యం దాని మీద మీడియం, చిన్న సినిమాల నిర్మాతలు కర్చీఫ్ వేసుకోవడానికి పోటీ పడుతున్నారు. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సుధీర్ బాబు ‘హరోంహర’ని విడుదల చేయబోతున్నట్టు నిన్నే అధికార ప్రకటన ఇచ్చారు. జ్ఞాన సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇంటెన్స్ డ్రామా మీద సుధీర్ బాబు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. వరస డిజాస్టర్లతో బాగా తగ్గిపోయిన మార్కెట్ ని తిరిగి నిలబెడుతుందనే ధీమాతో ఎదురు చూస్తున్నాడు. టీజర్, పోస్టర్లు గట్రా ఆసక్తికరంగానే ఉన్నాయి. వచ్చే వారం నుంచి ప్రమోషన్లు పెంచుతారు.

అదే రోజు ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. నిజానికిది నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏదో ఒక సందర్భంలో తేదీలు చెప్పడం తర్వాత పోస్ట్ పోన్ కావడం జరిగాయి. బేబీ బ్లాక్ బస్టరయ్యాక ఆనంద్ కు డిమాండ్ పెరిగిన మాట వాస్తవం. కానీ గంగం గణేశా బేబీ కన్నా ముందు చేసిన సినిమానే టాక్ ఉంది. కాకపోతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగే థ్రిల్లర్ కాబట్టి పెర్ఫార్మన్స్ పరంగా ఆనంద్ మంచి వేరియేషన్స్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. పబ్లిసిటీ స్పెషల్ గా ప్లాన్ చేస్తే బజ్ పెంచుకుంటూ పోవచ్చు.

ఓపెన్ గా చెప్పాలంటే హైప్ పరంగా రెండు సినిమాలు ఒకే స్టేజిలో ఉన్నాయి. ఓపెనింగ్ రోజు జనం థియేటర్లకు రావాలంటే అంత మేజిక్ చేసే కంటెంట్ ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగాలి. ఇది పెద్ద టాస్కే. కాకపోతే అప్పటికంతా ఎలెక్షన్లు అయిపోయి ఉంటాయి కాబట్టి పబ్లిక్ మాములు మూడ్ లోకి వచ్చేసి ఉంటారు. బడ్జెట్ పరంగా హరోంహరకు ఎక్కువ ఖర్చు పెట్టారు. సుధీర్ బాబుకి ఇది హిట్ కావడం చాలా అవసరం. ఆనంద్ దేవరకొండకి గంగం గణేశా హిట్ అయితే బోనస్సే. కాకతాళీయంగా రెండూ దేవుడికి సంబంధించిన మంత్రాలే కావడం గమనించాల్సిన విషయం. 

This post was last modified on April 29, 2024 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

15 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

1 hour ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

2 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

4 hours ago