ఏదైనా డేట్ ఖాళీగా ఉండటం ఆలస్యం దాని మీద మీడియం, చిన్న సినిమాల నిర్మాతలు కర్చీఫ్ వేసుకోవడానికి పోటీ పడుతున్నారు. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సుధీర్ బాబు ‘హరోంహర’ని విడుదల చేయబోతున్నట్టు నిన్నే అధికార ప్రకటన ఇచ్చారు. జ్ఞాన సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇంటెన్స్ డ్రామా మీద సుధీర్ బాబు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. వరస డిజాస్టర్లతో బాగా తగ్గిపోయిన మార్కెట్ ని తిరిగి నిలబెడుతుందనే ధీమాతో ఎదురు చూస్తున్నాడు. టీజర్, పోస్టర్లు గట్రా ఆసక్తికరంగానే ఉన్నాయి. వచ్చే వారం నుంచి ప్రమోషన్లు పెంచుతారు.
అదే రోజు ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. నిజానికిది నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏదో ఒక సందర్భంలో తేదీలు చెప్పడం తర్వాత పోస్ట్ పోన్ కావడం జరిగాయి. బేబీ బ్లాక్ బస్టరయ్యాక ఆనంద్ కు డిమాండ్ పెరిగిన మాట వాస్తవం. కానీ గంగం గణేశా బేబీ కన్నా ముందు చేసిన సినిమానే టాక్ ఉంది. కాకపోతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగే థ్రిల్లర్ కాబట్టి పెర్ఫార్మన్స్ పరంగా ఆనంద్ మంచి వేరియేషన్స్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. పబ్లిసిటీ స్పెషల్ గా ప్లాన్ చేస్తే బజ్ పెంచుకుంటూ పోవచ్చు.
ఓపెన్ గా చెప్పాలంటే హైప్ పరంగా రెండు సినిమాలు ఒకే స్టేజిలో ఉన్నాయి. ఓపెనింగ్ రోజు జనం థియేటర్లకు రావాలంటే అంత మేజిక్ చేసే కంటెంట్ ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగాలి. ఇది పెద్ద టాస్కే. కాకపోతే అప్పటికంతా ఎలెక్షన్లు అయిపోయి ఉంటాయి కాబట్టి పబ్లిక్ మాములు మూడ్ లోకి వచ్చేసి ఉంటారు. బడ్జెట్ పరంగా హరోంహరకు ఎక్కువ ఖర్చు పెట్టారు. సుధీర్ బాబుకి ఇది హిట్ కావడం చాలా అవసరం. ఆనంద్ దేవరకొండకి గంగం గణేశా హిట్ అయితే బోనస్సే. కాకతాళీయంగా రెండూ దేవుడికి సంబంధించిన మంత్రాలే కావడం గమనించాల్సిన విషయం.
This post was last modified on April 29, 2024 5:26 pm
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…