Movie News

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ గతంలో చెప్పిన ప్రకారం 2025లో వచ్చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు కానీ నిజానికి ఆ కోరిక అంత సులభంగా నెరవేరేలా లేదు. ఎందుకో చూద్దాం. ఈ సీక్వెల్ కి ఇంకా క్యాస్టింగ్ కుదరలేదు. పెద్ద స్టార్స్ ని భాగం చేయాలనేది ప్రశాంత్ వర్మ టార్గెట్. కానీ దీనికి చాలా టైం పడుతుంది. తాను కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి నెరేషన్ ఇచ్చి ఒప్పించి రెమ్యునరేషన్లు గట్రా మాట్లాడి సెట్ చేయడానికి నెలలు గడిచిపోతాయి.

ఒకవైపు దీని పనులు చూసుకుంటూనే ప్రశాంత్ వర్మ ఇతర ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆక్టోపస్ టైటిల్ తో ఒక థ్రిల్లర్ తీస్తున్నాడు. సగానికి పైగానే పూర్తయ్యిందట. దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రణ్వీర్ సింగ్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోంది. అంతా ఓకే అనుకుంటే జై హనుమాన్ కంటే ముందు ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఇంకో వైపు డివివి దానయ్య కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న అధీరాను తాను చేయాలా లేక ఇంకో దర్శకుడికి బాధ్యత అప్పగించాలానే ఆలోచనలో ప్రశాంత్ వర్మ తలమునకలై ఉన్నాడు.

ఇవన్నీ కొలిక్కి రావాలంటే జై హనుమాన్ ఆలస్యం తప్ప వేరే మార్గం లేదు. పరిణామాలు గమనిస్తే 2026 లేదా ఇంకో ఏడాది లేట్ గా తప్ప అంతకన్నా ముందు రిలీజయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్, 3డి అంటూ కొత్త సాంకేతికతలు జోడిస్తున్న ప్రశాంత్ వర్మ ఇతర కమిట్ మెంట్స్ పూర్తి చేసిగాని దీని మీద మనసు పెట్టలేడు. పైగా నిర్మాణ సంస్థలు ఏవి ఇందులో భాగం పంచుకుంటాయనేది వెల్లడి కాలేదు. సో ఎదురు చూపులు కాస్త ఎక్కువే అవసరం పడేలా ఉన్నాయి. ఈ కారణంగానే తేజ సజ్జ కూడా జై హనుమాన్ గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాడు.

Satya

Recent Posts

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

1 hour ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

1 hour ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

2 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

2 hours ago

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని…

3 hours ago

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…

3 hours ago