శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేరలో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. క్యామియో తరహా అంటున్నారు కానీ నిడివి పరంగా చూసుకుంటే మల్టీస్టారర్ గానే చెప్పొచ్చని యూనిట్ టాక్. ఇందులో నాగ్ పాత్ర పోలీస్ ఆఫీసర్ గా ఒక డిఫరెంట్ షేడ్ లో ఉంటుందని తెలిసింది. పట్టుకోవడానికి ప్రయత్నించి నిరాశ చెందే ఒక విభిన్న నేపథ్యం ఉంటుందట. బ్రహ్మాండమైన తెలివి తేటలున్నా చిల్లి గవ్వ లేని స్థితి నుంచి వందల వేల కోట్లకు పడగలెత్తే కుబేర వెంటపడే ఆఫీసర్ గా నాగార్జున క్యారెక్టరైజేషన్ కొత్తగా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్.
ఇప్పటిదాకా నాగార్జున ఏడుసార్లు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు, అరణ్య కాండ, శాంతి క్రాంతి, నిర్ణయం, రక్షణ, ఆవిడా మా ఆవిడే, శివమణి, ఆఫీసర్ సినిమాల్లో పోలీస్ గా నటించాడు. వీటిలో ఒక్క శివమణి మాత్రమే పెద్ద హిట్టు. ఓ రెండు యావరేజయ్యాయి. మిగిలినవి ఫ్లాపే. తిరిగి ఇంత గ్యాప్ తర్వాత కింగ్ ఇలా కనిపించడం ఫ్యాన్స్ కి కనువిందే. కుబేరలో రష్మిక మందన్న హీరోయిన్. నాగ్ కు ఎవరైనా జోడి ఉండేది లేనిది ఇంకా బయట పెట్టడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్స్ ఇద్దరు హీరోలతో తీస్తున్నారు శేఖర్ కమ్ముల. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.
ఈ ఏడాది విడుదల సాధ్యాసాధ్యాల గురించి టీమ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఒకవేళ సాధ్యం కాకపోతే 2025 సంక్రాంతి బరిలో దింపాలనేది నాగార్జున కోరిక. కానీ విశ్వంభర, రవితేజ-సితార బ్యానర్ ఆల్రెడీ పండగ స్లాట్ ని లాక్ చేసుకున్నాయి. అజిత్ గుడ్ బైద్ అండ్ ఆగ్లీ రేస్ లో ఉంది. అఫీషియల్ గా ఇవన్నీ ఆల్రెడీ ప్రకటించారు. సో కుబేర రావాలంటే కేవలం తెలుగే కాదు తమిళ మార్కెట్ స్థితిగతులను కూడా బేరీజు వేసుకోవాలి. డిసెంబర్ ఆప్షన్ చూస్తున్నారు కానీ మ్యాటర్ అయితే ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అంతకన్నా ముందు వచ్చే ఛాన్స్ అయితే దాదాపుగా లేనట్టే.
This post was last modified on April 24, 2024 3:05 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…