శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేరలో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. క్యామియో తరహా అంటున్నారు కానీ నిడివి పరంగా చూసుకుంటే మల్టీస్టారర్ గానే చెప్పొచ్చని యూనిట్ టాక్. ఇందులో నాగ్ పాత్ర పోలీస్ ఆఫీసర్ గా ఒక డిఫరెంట్ షేడ్ లో ఉంటుందని తెలిసింది. పట్టుకోవడానికి ప్రయత్నించి నిరాశ చెందే ఒక విభిన్న నేపథ్యం ఉంటుందట. బ్రహ్మాండమైన తెలివి తేటలున్నా చిల్లి గవ్వ లేని స్థితి నుంచి వందల వేల కోట్లకు పడగలెత్తే కుబేర వెంటపడే ఆఫీసర్ గా నాగార్జున క్యారెక్టరైజేషన్ కొత్తగా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్.
ఇప్పటిదాకా నాగార్జున ఏడుసార్లు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు, అరణ్య కాండ, శాంతి క్రాంతి, నిర్ణయం, రక్షణ, ఆవిడా మా ఆవిడే, శివమణి, ఆఫీసర్ సినిమాల్లో పోలీస్ గా నటించాడు. వీటిలో ఒక్క శివమణి మాత్రమే పెద్ద హిట్టు. ఓ రెండు యావరేజయ్యాయి. మిగిలినవి ఫ్లాపే. తిరిగి ఇంత గ్యాప్ తర్వాత కింగ్ ఇలా కనిపించడం ఫ్యాన్స్ కి కనువిందే. కుబేరలో రష్మిక మందన్న హీరోయిన్. నాగ్ కు ఎవరైనా జోడి ఉండేది లేనిది ఇంకా బయట పెట్టడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్స్ ఇద్దరు హీరోలతో తీస్తున్నారు శేఖర్ కమ్ముల. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.
ఈ ఏడాది విడుదల సాధ్యాసాధ్యాల గురించి టీమ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఒకవేళ సాధ్యం కాకపోతే 2025 సంక్రాంతి బరిలో దింపాలనేది నాగార్జున కోరిక. కానీ విశ్వంభర, రవితేజ-సితార బ్యానర్ ఆల్రెడీ పండగ స్లాట్ ని లాక్ చేసుకున్నాయి. అజిత్ గుడ్ బైద్ అండ్ ఆగ్లీ రేస్ లో ఉంది. అఫీషియల్ గా ఇవన్నీ ఆల్రెడీ ప్రకటించారు. సో కుబేర రావాలంటే కేవలం తెలుగే కాదు తమిళ మార్కెట్ స్థితిగతులను కూడా బేరీజు వేసుకోవాలి. డిసెంబర్ ఆప్షన్ చూస్తున్నారు కానీ మ్యాటర్ అయితే ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అంతకన్నా ముందు వచ్చే ఛాన్స్ అయితే దాదాపుగా లేనట్టే.
This post was last modified on April 24, 2024 3:05 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…