Movie News

క‌ల‌ర్ ఫొటో రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ఈ మ‌ధ్య తెలుగులో చ‌క్క‌టి ప్రోమోల‌తో ఆక‌ట్టుకున్న చిన్న సినిమా.. క‌ల‌ర్ ఫోటో. కమెడియన్‌గా సత్తా చాటిన సుహాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. తెలుగు టాలెంటెడ్ హీరోయిన్ చాందిని చౌదరి కథానాయికగా.. కొత్త దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రమిది. ‘హృదయకాలేయం’ దర్శక నిర్మాత సాయిరాజేష్ నీలం ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. దీని టీజ‌ర్, పాట‌.. మంచి ఫీల్‌తో ఉండి జ‌నాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఈ చిత్రం అల్లు వారి ఓటీటీ ఆహాలో రిలీజ్ కాబోతోంద‌ని వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. దీపావ‌ళికి రిలీజ్ అన్నారు. కానీ అంత‌కంటే ముందే సినిమా స్ట్రీమ్ కాబోతోంది.

వచ్చే నెల‌లో ద‌స‌రా కానుక‌గా క‌ల‌ర్ ఫోటోను ఆహాలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ద‌స‌రా అక్టోబ‌రు 25న కాగా.. అంత‌కు రెండు రోజుల ముందు, అక్టోబ‌రు 23న క‌ల‌ర్ ఫోటో విడుద‌ల కానుంది. కొత్త కంటెంట్ లేద‌ని ఆహా మీద విమ‌ర్శ‌లు వ‌స్తున్న త‌రుణంలో ఆ సంస్థ కొంచెం దూకుడు పెంచింది. అక్టోబ‌రు 2న ఆహాలోనే రాజ్ త‌రుణ్ సినిమా ఒరేయ్ బుజ్జిగా విడుద‌ల కానున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే క‌ల‌ర్ ఫోటో గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఈ నెల 18న అందులోనే అమ‌రం అఖిలం ప్రేమ అనే మ‌రో చిన్న సినిమా వ‌స్తోంది. అన్నింట్లోకి ప్రేక్ష‌కుల దృష్టిని ఎక్కువ ఆక‌ర్షిస్తున్న‌ది మాత్రం క‌ల‌ర్ ఫోటోనే. ఆహా ప‌ట్ల ఆక‌ర్ష‌ణ పెంచే సినిమా అవుతుంద‌ని దీనిపై అంచ‌నాలు పెట్టుకున్నారు.

This post was last modified on September 15, 2020 8:12 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

12 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

16 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago