ఈ మధ్య తెలుగులో చక్కటి ప్రోమోలతో ఆకట్టుకున్న చిన్న సినిమా.. కలర్ ఫోటో. కమెడియన్గా సత్తా చాటిన సుహాస్ను హీరోగా పరిచయం చేస్తూ.. తెలుగు టాలెంటెడ్ హీరోయిన్ చాందిని చౌదరి కథానాయికగా.. కొత్త దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రమిది. ‘హృదయకాలేయం’ దర్శక నిర్మాత సాయిరాజేష్ నీలం ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. దీని టీజర్, పాట.. మంచి ఫీల్తో ఉండి జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈ చిత్రం అల్లు వారి ఓటీటీ ఆహాలో రిలీజ్ కాబోతోందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీపావళికి రిలీజ్ అన్నారు. కానీ అంతకంటే ముందే సినిమా స్ట్రీమ్ కాబోతోంది.
వచ్చే నెలలో దసరా కానుకగా కలర్ ఫోటోను ఆహాలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దసరా అక్టోబరు 25న కాగా.. అంతకు రెండు రోజుల ముందు, అక్టోబరు 23న కలర్ ఫోటో విడుదల కానుంది. కొత్త కంటెంట్ లేదని ఆహా మీద విమర్శలు వస్తున్న తరుణంలో ఆ సంస్థ కొంచెం దూకుడు పెంచింది. అక్టోబరు 2న ఆహాలోనే రాజ్ తరుణ్ సినిమా ఒరేయ్ బుజ్జిగా విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కలర్ ఫోటో గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ నెల 18న అందులోనే అమరం అఖిలం ప్రేమ అనే మరో చిన్న సినిమా వస్తోంది. అన్నింట్లోకి ప్రేక్షకుల దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తున్నది మాత్రం కలర్ ఫోటోనే. ఆహా పట్ల ఆకర్షణ పెంచే సినిమా అవుతుందని దీనిపై అంచనాలు పెట్టుకున్నారు.
This post was last modified on September 15, 2020 8:12 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…