తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు బ్లాక్ బస్టర్ కావడం వల్లే తర్వాత ఒక్క హిట్టు లేకపోయినా విజయ్ ఆంటోనీకి తెలుగులో ఇంకా మార్కెట్ దొరుకుతోంది. జయాపజయాల సంగతి పక్కనపెడితే రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా ఏదో విభిన్నంగా ప్రయత్నిస్తూనే ఉండే ఈ కోలీవుడ్ హీరో తాజాగా లవ్ గురుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో రోమియో టైటిల్ తో వచ్చిన ఈ ఎంటర్ టైనర్ రెండు భాషల్లో ఒకేసారి రిలీజయ్యింది. మృణాళిని రవి హీరోయిన్ గా నటించగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ పంపిణి చేసింది. ఇంతకీ లవ్ గురు ఎలా ఉన్నాడో చూద్దాం.
మూడు పదుల వయసు దాటిన అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేషియాలో లైఫ్ సెటిల్ చేసుకుని పెళ్లి గురించి ఊసే మర్చిపోతాడు. తల్లి తండ్రులు బలవంతం చేయడంతో ఇండియాకు వచ్చి లీల(మృణాళిని రవి)ని ఇష్టపడి మూడు ముళ్ళు వేస్తాడు. అయితే లీల జీవిత లక్ష్యం హీరోయిన్ కావడం. కేవలం కుటుంబం ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికే తనను చేసుకుందని అర్థం చేసుకున్న అరవింద్ ఆమెకు ప్రేమతో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. దీనికి చెల్లికి సంబంధించిన ఒక గతం కూడా ఉంటుంది. చివరికి అరవింద్ భార్య మనసును గెలుచుకునేందుకు ఏం చేశాడనేదే లవ్ గురు స్టోరీ.
రబ్ నే బనాది జోడిలో షారుఖ్, ఆయనకు ఇద్దరులో రమ్యకృష్ణ పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు వినాయక్ ఈ లవ్ గురు కథ రాసుకున్నాడు. వినోద కోణంలో ట్రీట్ మెంట్ కొంత ఫ్రెష్ గా అనిపించినా ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్ చేయడంలో జరిగిన తడబాటు వల్ల లవ్ గురు ఒక మాములు సినిమాగా మిగిలిపోయింది. నటనపరంగా విజయ్ ఆంటోనీలో మంచి పరిణితి కనిపించింది. యోగిబాబు కామెడీ పేలలేదు. సన్నివేశాలన్నీ ఊహించినట్టే నెమ్మదిగా జరుగుతాయి. కథలోనూ వైవిధ్యం లేదు. కాసింత వినోదం తప్ప లవ్ గురు పాఠాలు ప్రేక్షకులకు ఎక్కేలా లేవు.
This post was last modified on April 12, 2024 10:25 am
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…