ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రూపొందిన రాధే శ్యామ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే దర్శకుడు రాధాకృష్ణ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయేది. కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేకపోవడం అతని పాలిట శాపంగా మారింది. జ్యోతిష్యాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం వరకు బాగానే ఉన్నా దానికి టైటానిక్ తరహా స్క్రీన్ ప్లే జోడించబోయి ఖంగు తిన్న ఈ రెండు సినిమాల డైరెక్టర్ కు ఇప్పటికే బోలెడు గ్యాప్ వచ్చేసింది. అయితే ఇతని మీద నమ్మకంతో ఏళ్ళ తరబడి తమ బ్యానర్ లోనే లాక్ చేసుకున్న యువి క్రియేషన్స్ త్వరలోనే ఒక ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
దీని వెనుక రకరకాల క్యాలికులేషన్లు ఉన్నాయి. రాధాకృష్ణ మొదటి సినిమా జిల్ హీరో గోపీచంద్. తనతోనే తాజా కథని ఓకే చేయించుకున్నాడు. ఇది జరిగి నెలలు గడిచిపోయాయి కానీ ఫైనల్ గా కార్యరూపం దాల్చబోతోంది. ఇటు హీరో అటు దర్శకుడు ఇద్దరూ తనకు కావాల్సిన వాళ్లే కావడంతో ప్రభాస్ ప్రత్యేకంగా రికమండ్ చేసి మరీ ఈ కాంబోకి శ్రీకారం చుట్టించినట్టు టాక్ ఉంది. డార్లింగ్ మాటని కాదనేంత ఆలోచన యువి మేకర్స్ ఎప్పటికీ చేయరు. పైగా గోపీచంద్ హిట్టు లేక సంవత్సరాలు గడిచిపోయాయి. భీమా సైతం నిరాశపరిచింది. వసూళ్లు వచ్చాయి కానీ అతని స్టామినా కాదది.
సో ఇవన్నీ కూడి రాధే శ్యామ్ చేసిన గాయానికి ముందుగా జిల్ కలయికని రిపీట్ చేయబోతున్నాడు రాధాకృష్ణ. ఫైనల్ వెర్షన్ నెరేషన్ కూడా అయ్యిందట. ప్రస్తుతం శ్రీను వైట్ల ప్రాజెక్టులో బిజీగా ఉన్న గోపీచంద్ వేసవిలో ఫ్రీ అయిపోతాడు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీ అవుతాడు. జిల్ వచ్చి తొమ్మిదేళ్లు దాటేసింది. దశాబ్దం కెరీర్ లో దర్శకుడు రెండే సినిమాలు చేయడం సంతోషించే విషయం కాదు. పోనీ అవి బాహుబలి రేంజ్ క్లాసిక్స్ అయితే వేరే విషయం. జిల్ హిట్ అనిపించుకోగా రాధే శ్యామ్ గురించి తెలిసిందే. ఈసారైనా బలంగా ప్రూవ్ చేసుకోకపోతే కష్టం.
This post was last modified on April 6, 2024 6:11 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…