ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రూపొందిన రాధే శ్యామ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే దర్శకుడు రాధాకృష్ణ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయేది. కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేకపోవడం అతని పాలిట శాపంగా మారింది. జ్యోతిష్యాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం వరకు బాగానే ఉన్నా దానికి టైటానిక్ తరహా స్క్రీన్ ప్లే జోడించబోయి ఖంగు తిన్న ఈ రెండు సినిమాల డైరెక్టర్ కు ఇప్పటికే బోలెడు గ్యాప్ వచ్చేసింది. అయితే ఇతని మీద నమ్మకంతో ఏళ్ళ తరబడి తమ బ్యానర్ లోనే లాక్ చేసుకున్న యువి క్రియేషన్స్ త్వరలోనే ఒక ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
దీని వెనుక రకరకాల క్యాలికులేషన్లు ఉన్నాయి. రాధాకృష్ణ మొదటి సినిమా జిల్ హీరో గోపీచంద్. తనతోనే తాజా కథని ఓకే చేయించుకున్నాడు. ఇది జరిగి నెలలు గడిచిపోయాయి కానీ ఫైనల్ గా కార్యరూపం దాల్చబోతోంది. ఇటు హీరో అటు దర్శకుడు ఇద్దరూ తనకు కావాల్సిన వాళ్లే కావడంతో ప్రభాస్ ప్రత్యేకంగా రికమండ్ చేసి మరీ ఈ కాంబోకి శ్రీకారం చుట్టించినట్టు టాక్ ఉంది. డార్లింగ్ మాటని కాదనేంత ఆలోచన యువి మేకర్స్ ఎప్పటికీ చేయరు. పైగా గోపీచంద్ హిట్టు లేక సంవత్సరాలు గడిచిపోయాయి. భీమా సైతం నిరాశపరిచింది. వసూళ్లు వచ్చాయి కానీ అతని స్టామినా కాదది.
సో ఇవన్నీ కూడి రాధే శ్యామ్ చేసిన గాయానికి ముందుగా జిల్ కలయికని రిపీట్ చేయబోతున్నాడు రాధాకృష్ణ. ఫైనల్ వెర్షన్ నెరేషన్ కూడా అయ్యిందట. ప్రస్తుతం శ్రీను వైట్ల ప్రాజెక్టులో బిజీగా ఉన్న గోపీచంద్ వేసవిలో ఫ్రీ అయిపోతాడు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీ అవుతాడు. జిల్ వచ్చి తొమ్మిదేళ్లు దాటేసింది. దశాబ్దం కెరీర్ లో దర్శకుడు రెండే సినిమాలు చేయడం సంతోషించే విషయం కాదు. పోనీ అవి బాహుబలి రేంజ్ క్లాసిక్స్ అయితే వేరే విషయం. జిల్ హిట్ అనిపించుకోగా రాధే శ్యామ్ గురించి తెలిసిందే. ఈసారైనా బలంగా ప్రూవ్ చేసుకోకపోతే కష్టం.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…