సిసింద్రీ.. ఈ సినిమాను తలుచుకోగానే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది నైన్టీస్ ప్రేక్షకులకు. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ చిన్న పిల్లాడిగా ఉండగా.. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తీసిన సిసింద్రీ అప్పట్లో సూపర్ హిట్టయింది. అందులో తల్లి పాత్రలో ఆమని తనదైన ముద్ర వేసింది. నాగ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివనాగేశ్వరరావు దర్శకుడు. ఈ చిత్రం విడుదలై సోమవారానికి 25 ఏళ్లు పూర్తవడం విశేషం. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆమని పాల్గొంది. ఈ సందర్భంగా ఆమని సిసింద్రీ సినిమా కోసం బుల్లి అఖిల్తో పని చేసిన అనుభవాలను పంచుకుంది. అఖిల్కు ఇప్పుడు మళ్లీ అమ్మగా నటిస్తున్నట్లు కూడా వెల్లడించింది.
సిసింద్రీ సినిమాలో అఖిల్కు అమ్మ పాత్ర చేయాలని నాగార్జున అడిగిన వెంటనే ఒప్పుకున్నా. చాలా కష్టపడి సిసింద్రీ చేశాం. 30 రోజుల్లో సినిమా అనుకుంటే 60 రోజులైంది. చిన్న పిల్లాడితో షూటింగ్ అంటే అలాగే ఉంటుంది. అఖిల్ పడుకున్నపుడు మేం కూడా విశ్రాంతి తీసుకునేవాళ్లం. వాడికి మూడ్ వచ్చినపుడు షూట్ చేసేవాళ్లం. అఖిల్కు అందరూ సహకరించారు. సిసింద్రీ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు సమయమే తెలియలేదు. నా సొంత బిడ్డ లాగే అనిపించాడు అఖిల్. నన్ను అమ్మలాగే భావించేవాడు. అమ్మా అనే అనేవాడు. ఇప్పటికీ ఎప్పుడు కలిసినా వెతుక్కుంటూ వచ్చి మాట్లాడతాడు. నన్ను అమ్మఆ అని హత్తుకుంటాడు. అంతకంటే ప్రేమ ఇంకెక్కడా లేదు. అది తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు కూడా అఖిల్కు తల్లిగా ఓ సినిమా చేస్తున్నాను. అఖిల్ను ఇప్పుడు చూసినా నాకు చిన్న బాబులాగే కనిపిస్తాడు అని ఆమని చెప్పింది. బహుశా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లోనే అఖిల్కు అమ్మగా ఆమని నటిస్తుండొచ్చేమో.
This post was last modified on September 15, 2020 2:47 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…