సిసింద్రీ.. ఈ సినిమాను తలుచుకోగానే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది నైన్టీస్ ప్రేక్షకులకు. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ చిన్న పిల్లాడిగా ఉండగా.. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తీసిన సిసింద్రీ అప్పట్లో సూపర్ హిట్టయింది. అందులో తల్లి పాత్రలో ఆమని తనదైన ముద్ర వేసింది. నాగ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివనాగేశ్వరరావు దర్శకుడు. ఈ చిత్రం విడుదలై సోమవారానికి 25 ఏళ్లు పూర్తవడం విశేషం. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆమని పాల్గొంది. ఈ సందర్భంగా ఆమని సిసింద్రీ సినిమా కోసం బుల్లి అఖిల్తో పని చేసిన అనుభవాలను పంచుకుంది. అఖిల్కు ఇప్పుడు మళ్లీ అమ్మగా నటిస్తున్నట్లు కూడా వెల్లడించింది.
సిసింద్రీ సినిమాలో అఖిల్కు అమ్మ పాత్ర చేయాలని నాగార్జున అడిగిన వెంటనే ఒప్పుకున్నా. చాలా కష్టపడి సిసింద్రీ చేశాం. 30 రోజుల్లో సినిమా అనుకుంటే 60 రోజులైంది. చిన్న పిల్లాడితో షూటింగ్ అంటే అలాగే ఉంటుంది. అఖిల్ పడుకున్నపుడు మేం కూడా విశ్రాంతి తీసుకునేవాళ్లం. వాడికి మూడ్ వచ్చినపుడు షూట్ చేసేవాళ్లం. అఖిల్కు అందరూ సహకరించారు. సిసింద్రీ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు సమయమే తెలియలేదు. నా సొంత బిడ్డ లాగే అనిపించాడు అఖిల్. నన్ను అమ్మలాగే భావించేవాడు. అమ్మా అనే అనేవాడు. ఇప్పటికీ ఎప్పుడు కలిసినా వెతుక్కుంటూ వచ్చి మాట్లాడతాడు. నన్ను అమ్మఆ అని హత్తుకుంటాడు. అంతకంటే ప్రేమ ఇంకెక్కడా లేదు. అది తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు కూడా అఖిల్కు తల్లిగా ఓ సినిమా చేస్తున్నాను. అఖిల్ను ఇప్పుడు చూసినా నాకు చిన్న బాబులాగే కనిపిస్తాడు అని ఆమని చెప్పింది. బహుశా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లోనే అఖిల్కు అమ్మగా ఆమని నటిస్తుండొచ్చేమో.
This post was last modified on September 15, 2020 2:47 am
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…