దర్శకత్వం వహించకపోయినా నిర్మాణంలో భాగస్వామిగా కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కృష్ణమ్మ ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసుకుంది. మే 3 థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీని టీజర్ ఏడాది క్రితం వచ్చింది. కొన్ని రోజులు వార్తల్లో నిలిచి ఆ తర్వాత ఊసు లేకుండా పోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమా లేక ఆర్థిక కారణాలా బయటికి చెప్పలేదు కానీ హీరో సత్యదేవ్ దీని మీద గంపెడాశలు పెట్టుకున్నాడు. వరస ఫ్లాపులతో తన మార్కెట్ బాగా నెమ్మదించిన నేపథ్యంలో కృష్ణమ్మ సూపర్ హిట్ కావడం చాలా అవసరం.
కల్కి 2898 ఏడి మే 9 వాయిదా కన్ఫర్మ్ కావడంతో ఒక్కొక్కరుగా దాని ముందు వెనుక తేదీలను లాక్ చేసుకుంటున్నారు. కృష్ణమ్మ తెలివిగా మే 3 రావడం వల్ల మంచి స్లాట్ దక్కించుకుంది. వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాకు కథ కొరటాలనే అందించారట. విజువల్స్ గట్రా చూస్తే ఇంటెన్స్ రివెంజ్ కథలా కనిపిస్తోంది. నటన, స్వరం రెండింట్లోనూ హై బేస్ చూపించే సత్యదేవ్ కు ఇదైనా బ్రేక్ ఇవ్వాలి. దేవర పనుల్లో కొరటాల బిజీ కావడం కూడా కృష్ణమ్మ జాప్యానికి కారణంగా తోస్తోంది. కాల భైరవ సంగీతం, సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
సత్యదేవ్ కు ఇది కాకుండా మరో మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి. అవి ఫుల్ బాటిల్, జీబ్రా, గరుడ చాప్టర్ 1. కృష్ణమ్మ కనక విజయవంతమైతే వీటికి బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుంది. గాడ్ ఫాదర్ లో విలన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించినప్పటికీ యావరేజ్ ఫలితం వల్ల తను కోరుకున్న మైలేజ్ రాలేదు. గుర్తుందా శీతాకాలం, గాడ్సే, స్కై లాబ్, తిమ్మరుసు, గువ్వా గోరింకా ఏవీ ఆశించిన రిజల్ట్స్ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే బ్లఫ్ మాస్టర్ తర్వాత అంత పేరు తీసుకొచ్చింది పడలేదు. మరి కొరటాల కలం బలం అందించిన కృష్ణమ్మ అయినా బ్రేక్ అందిస్తే అదే పదివేలు.
This post was last modified on April 5, 2024 5:08 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…