దర్శకత్వం వహించకపోయినా నిర్మాణంలో భాగస్వామిగా కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కృష్ణమ్మ ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసుకుంది. మే 3 థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీని టీజర్ ఏడాది క్రితం వచ్చింది. కొన్ని రోజులు వార్తల్లో నిలిచి ఆ తర్వాత ఊసు లేకుండా పోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమా లేక ఆర్థిక కారణాలా బయటికి చెప్పలేదు కానీ హీరో సత్యదేవ్ దీని మీద గంపెడాశలు పెట్టుకున్నాడు. వరస ఫ్లాపులతో తన మార్కెట్ బాగా నెమ్మదించిన నేపథ్యంలో కృష్ణమ్మ సూపర్ హిట్ కావడం చాలా అవసరం.
కల్కి 2898 ఏడి మే 9 వాయిదా కన్ఫర్మ్ కావడంతో ఒక్కొక్కరుగా దాని ముందు వెనుక తేదీలను లాక్ చేసుకుంటున్నారు. కృష్ణమ్మ తెలివిగా మే 3 రావడం వల్ల మంచి స్లాట్ దక్కించుకుంది. వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాకు కథ కొరటాలనే అందించారట. విజువల్స్ గట్రా చూస్తే ఇంటెన్స్ రివెంజ్ కథలా కనిపిస్తోంది. నటన, స్వరం రెండింట్లోనూ హై బేస్ చూపించే సత్యదేవ్ కు ఇదైనా బ్రేక్ ఇవ్వాలి. దేవర పనుల్లో కొరటాల బిజీ కావడం కూడా కృష్ణమ్మ జాప్యానికి కారణంగా తోస్తోంది. కాల భైరవ సంగీతం, సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
సత్యదేవ్ కు ఇది కాకుండా మరో మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి. అవి ఫుల్ బాటిల్, జీబ్రా, గరుడ చాప్టర్ 1. కృష్ణమ్మ కనక విజయవంతమైతే వీటికి బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుంది. గాడ్ ఫాదర్ లో విలన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించినప్పటికీ యావరేజ్ ఫలితం వల్ల తను కోరుకున్న మైలేజ్ రాలేదు. గుర్తుందా శీతాకాలం, గాడ్సే, స్కై లాబ్, తిమ్మరుసు, గువ్వా గోరింకా ఏవీ ఆశించిన రిజల్ట్స్ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే బ్లఫ్ మాస్టర్ తర్వాత అంత పేరు తీసుకొచ్చింది పడలేదు. మరి కొరటాల కలం బలం అందించిన కృష్ణమ్మ అయినా బ్రేక్ అందిస్తే అదే పదివేలు.
This post was last modified on April 5, 2024 5:08 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…