ఒక్క సినిమాతో కొందరు హీరోల తలరాత మారిపోతుంటుంది. సిద్ధు జొన్నలగడ్డ రాతను మార్చిన ఆ సినిమానే ‘డీజే టిల్లు’. అంతకుముందు అతను పదేళ్ల పాటు నటుడిగా నిలదొక్కుకోవడానికి పోరాడాడు. చాలా సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించాడు. తన పేరేంటో కూడా తెలియకుండానే రిలీజై వెళ్లిపోయిన సినిమాలు బోలెడు. ఐతే సిద్ధు హీరోగా చేసిన సినిమాల్లో తనకు మంచి పేరు తెచ్చింది ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. సిద్ధుకు స్టార్ ఇమేజ్ తెచ్చింది మాత్రం ‘డీజే టిల్లు’నే. ఈ సినిమాతో అతడికి మామూలు క్రేజ్ రాలేదు. ఈ క్రేజ్ను చెడగొట్టుకోకుండా.. చాలా టైం తీసుకుని దీని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ చేశాడు. సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసి.. క్రేజీ ప్రోమోలు వదిలి హైప్ పెంచాడు. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. తొలి షో నుంచి ఎక్కడ చూసినా హౌస్ ఫుల్సే.
వీకెండ్లో ‘టిల్లు స్క్వేర్’ సాయంత్రం షోలకు టికెట్లు దొరకడం కష్టమవుతోంది. శనివారం సాయంత్రం, రాత్రి షోలు ప్యాక్డ్ హౌస్లతో నడిచాయి. ఆదివారం అన్ని షోలూ మంచి ఆక్యుపెన్సీలతో నడవబోతున్నాయి. సినిమా గ్రాస్ ఆల్రెడీ రూ.50 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉంది.
నిర్మాత నాగవంశీ తొలి రోజు అన్నట్లే ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటే ఆశ్చర్యం లేదు. విజయ్ దేవరకొండకు ‘గీత గోవిందం’ ఎలాగో సిద్ధుకు ‘టిల్లు స్క్వేర్’ అలాంటి సినిమా అన్నమాట. కొంచెం మార్కెట్ ఉన్న చిన్న హీరో స్థాయి నుంచి.. మిడ్ రేంజ్ హీరోల్లో టాప్లో ఉన్న నాని, విజయ్ దేవరకొండ, రామ్, అడివి శేష్ల సరసన చేరిపోయాడు సిద్ధు. తనకున్న అభిరుచికి, రైటింగ్ టాలెంట్కి సిద్ధు ఇంకా పెద్ద స్థాయికి చేరే అవకాశముంది. చేతిలో ఉన్న సినిమాలు కూడా బాగా ఆడితే తనకు తిరుగుండదనే చెప్పాలి.
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…