సుహాస్ అనే నటుడిని మొదట్లో చూస్తే కామెడీ వేషాలకు తప్ప వేరే వాటికి సూట్ కాడు అనిపించేది. కానీ అతను విలన్గా చేశాడు. హీరో అయ్యాడు. లీడ్ రోల్స్లో వరుసగా మంచి మంచి సినిమాలు అందిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు. ఓటీటీలో విడుదలైన కలర్ ఫొటో మంచి స్పందన తెచ్చుకున్నాక రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు అతడికి థియేట్రికల్ సక్సెస్ అందించాయి. దీంతో సుహాస్కు అవకాశాలు వెల్లువెతుతున్నాయి.
అతను ఆల్రెడీ పూర్తిచేసిన, ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న, త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతున్న సినిమాలు అరడజనుకు పైగా ఉండడం విశేషం. ఆల్రెడీ ప్రసన్న వదనం అనే సినిమా వేసవి విడుదలకు సిద్ధమైంది. కొత్తగా శ్రీరంగనీతులు అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక ఈ మధ్యే కీర్తి సురేష్ జోడీగా సుహాస్ అమేజాన్ ప్రైమ్ కోసం ఓ సినిమా చేయబోతున్న విషయం వెల్లడైంది. అలాగే సందీప్ రెడ్డి బండ్ల అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా ఒకటి ఉంది. ఇవి కాక కొత్తగా సుహాస్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఆ చిత్రం పేరు.. ఓ భామ అయ్యో రామ. రామ్ గోదాల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. రెండు కొత్త నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాయి.
ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమిళ చిత్రం జో మూవీతో అందరి దృష్టిలో పడ్డ మాళవిక మనోజ్ ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది.ఈ మలయాళ అమ్మాయికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది పక్కా ప్రేమకథా చిత్రం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వరుసగా సినిమాలు చేస్తూ సుహాస్ బిజీ నటుడిగా మారిపోతున్నాడు.
This post was last modified on March 31, 2024 7:44 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…