వేదళాం చిత్రాన్ని రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని రీమేక్ చేసే బాధ్యతను మెహర్ రమేష్కు అప్పగించారనేది కూడా తెలిసిన సంగతే. చిరంజీవి ఇంకా అధికారికంగా ఆ విషయం ప్రకటించకపోయినా, చిరంజీవితో మెహర్ సినిమా వుంటుందని పవన్ కళ్యాణ్ ఖరారు చేసేసాడు. అయితే ఈ రీమేక్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టమయిన సమాచారం లేదు. ముందుగా ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే చిరంజీవి తదుపరి చిత్రం గురించి కాల్ తీసుకుంటారు. ఇదిలావుంటే వేదళాం రీమేక్ని వీలయినంత క్రేజీగా మలిచేందుకు మెహర్ రమేష్ మంచి సపోర్టింగ్ కాస్ట్ కోసం చూస్తున్నాడు.
ఆ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఒరిజినల్లో లక్ష్మి మీనన్ ఆ క్యారెక్టర్ చేసింది. తెలుగు వెర్షన్లో సాయి పల్లవితో ఆ పాత్ర చేయిస్తే సినిమాకి క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. అయితే చాలా సెలక్టివ్గా సినిమాలు చేసే సాయి పల్లవి హీరో చెల్లెలి పాత్ర చేయడానికి ఓకే అంటుందా అనేది అనుమానమే. కాకపోతే చిరంజీవి సినిమాలో నటించే అవకాశం కాబట్టి ఆమె ఈ ఆఫర్ని కన్సిడర్ చేయవచ్చు. ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరమయిన మెహర్ రమేష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఎఫర్టస్ పెడుతున్నాడట.
This post was last modified on September 12, 2020 10:44 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…