వేదళాం చిత్రాన్ని రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని రీమేక్ చేసే బాధ్యతను మెహర్ రమేష్కు అప్పగించారనేది కూడా తెలిసిన సంగతే. చిరంజీవి ఇంకా అధికారికంగా ఆ విషయం ప్రకటించకపోయినా, చిరంజీవితో మెహర్ సినిమా వుంటుందని పవన్ కళ్యాణ్ ఖరారు చేసేసాడు. అయితే ఈ రీమేక్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టమయిన సమాచారం లేదు. ముందుగా ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే చిరంజీవి తదుపరి చిత్రం గురించి కాల్ తీసుకుంటారు. ఇదిలావుంటే వేదళాం రీమేక్ని వీలయినంత క్రేజీగా మలిచేందుకు మెహర్ రమేష్ మంచి సపోర్టింగ్ కాస్ట్ కోసం చూస్తున్నాడు.
ఆ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఒరిజినల్లో లక్ష్మి మీనన్ ఆ క్యారెక్టర్ చేసింది. తెలుగు వెర్షన్లో సాయి పల్లవితో ఆ పాత్ర చేయిస్తే సినిమాకి క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. అయితే చాలా సెలక్టివ్గా సినిమాలు చేసే సాయి పల్లవి హీరో చెల్లెలి పాత్ర చేయడానికి ఓకే అంటుందా అనేది అనుమానమే. కాకపోతే చిరంజీవి సినిమాలో నటించే అవకాశం కాబట్టి ఆమె ఈ ఆఫర్ని కన్సిడర్ చేయవచ్చు. ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరమయిన మెహర్ రమేష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఎఫర్టస్ పెడుతున్నాడట.
This post was last modified on September 12, 2020 10:44 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…