వేదళాం చిత్రాన్ని రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని రీమేక్ చేసే బాధ్యతను మెహర్ రమేష్కు అప్పగించారనేది కూడా తెలిసిన సంగతే. చిరంజీవి ఇంకా అధికారికంగా ఆ విషయం ప్రకటించకపోయినా, చిరంజీవితో మెహర్ సినిమా వుంటుందని పవన్ కళ్యాణ్ ఖరారు చేసేసాడు. అయితే ఈ రీమేక్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టమయిన సమాచారం లేదు. ముందుగా ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే చిరంజీవి తదుపరి చిత్రం గురించి కాల్ తీసుకుంటారు. ఇదిలావుంటే వేదళాం రీమేక్ని వీలయినంత క్రేజీగా మలిచేందుకు మెహర్ రమేష్ మంచి సపోర్టింగ్ కాస్ట్ కోసం చూస్తున్నాడు.
ఆ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఒరిజినల్లో లక్ష్మి మీనన్ ఆ క్యారెక్టర్ చేసింది. తెలుగు వెర్షన్లో సాయి పల్లవితో ఆ పాత్ర చేయిస్తే సినిమాకి క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. అయితే చాలా సెలక్టివ్గా సినిమాలు చేసే సాయి పల్లవి హీరో చెల్లెలి పాత్ర చేయడానికి ఓకే అంటుందా అనేది అనుమానమే. కాకపోతే చిరంజీవి సినిమాలో నటించే అవకాశం కాబట్టి ఆమె ఈ ఆఫర్ని కన్సిడర్ చేయవచ్చు. ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరమయిన మెహర్ రమేష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఎఫర్టస్ పెడుతున్నాడట.
This post was last modified on September 12, 2020 10:44 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…