రియా చక్రవర్తి డ్రగ్స్ వినియోగించే పలువురు నటీనటుల పేర్లను విచారణలో బయట పెట్టిందని, వారిలో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు వున్నాయని ‘టైమ్స్ నౌ’ బులెటిన్ ప్రసారం చేసింది. రకుల్ ప్రీత్ పేరు బయటకు రాగానే తెలుగు చిత్ర సీమలో కూడా చిన్నపాటి అలజడి మొదలయింది. అయితే తమ గురించి మీడియాలో అంత రచ్చ జరుగుతోన్నా రకుల్ కానీ, సారా అలీ ఖాన్ కానీ ఆ ఆరోపణలు అబద్ధమని ఖండించలేదు. మీడియాతో మాట్లాడకపోయినా కనీసం తమ సోషల్ మీడియాలో అయినా ఒక పోస్ట్ పెట్టి వుండొచ్చు. దీంతో ఈ విషయం నిజంగానే సీరియస్ ఏమో అనే అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే డ్రగ్స్ వినియోగించడం పెద్ద నేరం కాదట.
ఆ డ్రగ్స్ వేరొకరి కోసం తీసుకుని వారికి మధ్యవర్తిగా వ్యవహరిస్తే చాలా పెద్ద నేరమట. రియా చక్రవర్తి అందుకే ఇప్పుడు దోషిగా అరెస్టయింది. సుషాంత్ కోసం ఆమె డ్రగ్స్ కొనుగోలు చేయడం, పలువురు మధ్యవర్తులతో డీల్ చేయడంపై చాలా ఆధారాలు వుండడం వల్లే ఆమెకు బెయిల్ కూడా దొరకడం లేదు. ఆమె విచారణలో ఏ నటీనటుల పేర్లు చెప్పినా కానీ వాళ్లు కేవలం మాదకద్రవ్యాలు పుచ్చుకున్నట్టు అంగీకరించేస్తే పెద్దంత పేచీ వుండదట. ఏదేమైనా మీడియాలో ఏదైనా న్యూస్ రాగానే దానిపై వెంటనే ఖండన రాకపోతే వాళ్లు నోళ్లు తెరిచేలోగా నేరస్థులుగా జనం దృష్టిలో పర్మినెంట్గా ముద్రించుకుపోయే ప్రమాదముంది.
This post was last modified on September 12, 2020 10:29 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…