ఓవైపు బాలీవుడ్లో, మరోవైపు శాండిల్వుడ్లో డ్రగ్స్ అంశం కొన్ని రోజులుగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కన్నడ సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. డ్రగ్స్ రాకెట్తో సంబంధముందన్న ఆరోపణలతో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీరి ఆర్థిక వ్యవహారాల గురించి ఆరా తీస్తే ఒక్కొక్కరికి ఉన్న ఆస్తుల గురించి తెలిసి పోలీసులకు దిమ్మదిరిగిపోయిందట. ముఖ్యంగా సంజన ఆస్తులు వారికి విస్మయం కలిగించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది. బెంగుళూరు నగరంలో పదికి పైగా ఖరీదైన ఫ్లాట్లు సంజన పేరిట ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందట.
సంజన కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ నటించింది. కానీ ఆమె అన్ని చోట్లా చిన్నా చితకా సినిమాలే చేసింది. తెలుగులో చేసిన పెద్ద సినిమా బుజ్జిగాడులో కూడా ఆమెది సైడ్ రోలే. ఇలాంటి కథానాయిక సినిమాల ద్వారా ఎంత ఆదాయం సంపాదించి ఉండొచ్చని అంచనా వేస్తే.. దానికి, తన పేరిట ఉన్న ఆస్తులకు అసలు పొంతనే లేదట. ఈ నేపథ్యంలో డ్రగ్ రాకెట్లో భాగం కావడం ద్వారా సంజన ఈ ఆస్తులు సంపాదించిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా సంజనను డ్రగ్ టెస్టు కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తనను బకరాను చేశారంటూ అక్కడ పోలీసులపై విరుచుకుపడింది. సంజనతో పాటు రాగిణిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచిన పోలీసులు తదుపరి విచారణ కోసం వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.
This post was last modified on September 12, 2020 10:21 pm
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…