ఓవైపు బాలీవుడ్లో, మరోవైపు శాండిల్వుడ్లో డ్రగ్స్ అంశం కొన్ని రోజులుగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కన్నడ సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. డ్రగ్స్ రాకెట్తో సంబంధముందన్న ఆరోపణలతో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీరి ఆర్థిక వ్యవహారాల గురించి ఆరా తీస్తే ఒక్కొక్కరికి ఉన్న ఆస్తుల గురించి తెలిసి పోలీసులకు దిమ్మదిరిగిపోయిందట. ముఖ్యంగా సంజన ఆస్తులు వారికి విస్మయం కలిగించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది. బెంగుళూరు నగరంలో పదికి పైగా ఖరీదైన ఫ్లాట్లు సంజన పేరిట ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందట.
సంజన కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ నటించింది. కానీ ఆమె అన్ని చోట్లా చిన్నా చితకా సినిమాలే చేసింది. తెలుగులో చేసిన పెద్ద సినిమా బుజ్జిగాడులో కూడా ఆమెది సైడ్ రోలే. ఇలాంటి కథానాయిక సినిమాల ద్వారా ఎంత ఆదాయం సంపాదించి ఉండొచ్చని అంచనా వేస్తే.. దానికి, తన పేరిట ఉన్న ఆస్తులకు అసలు పొంతనే లేదట. ఈ నేపథ్యంలో డ్రగ్ రాకెట్లో భాగం కావడం ద్వారా సంజన ఈ ఆస్తులు సంపాదించిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా సంజనను డ్రగ్ టెస్టు కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తనను బకరాను చేశారంటూ అక్కడ పోలీసులపై విరుచుకుపడింది. సంజనతో పాటు రాగిణిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచిన పోలీసులు తదుపరి విచారణ కోసం వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.
This post was last modified on September 12, 2020 10:21 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…