Movie News

థియేటర్ అనుభూతి OTT ఇవ్వడం అసాధ్యం

హనుమాన్ ఓటిటిలో వచ్చాక ఊహించని విధంగా సోషల్ మీడియాలో నెగటివిటీ కనిపిస్తోంది. ఇప్పటిదాకా చూడనివాళ్ళు టీవీలో ఫోన్ లో చూసి ఇవేం గ్రాఫిక్స్, దీనికా మూడు వందల కోట్లు వచ్చాయని ట్వీట్లు పెడుతున్నారు. గుంటూరు కారం టైంలో దీని వల్ల తమ హీరో రన్ బాగా దెబ్బ తిందని ఫీలైన కొందరు మహేష్ ఫ్యాన్స్ వీళ్ళతో జత కట్టడంతో ఒక్కొక్కరుగా నెగటివ్ ఒపీనియన్స్ పంచుకుంటున్నారు. దీని మీద పెద్ద ఎత్తున డిబేట్లు కూడా జరుగుతున్నాయి. థియేటర్ లో పెద్ద స్క్రీన్ మీద డాల్బీ సౌండ్ తో చూస్తున్నప్పుడు వచ్చే అనుభూతి ఇంటి ఓటిటి ఇవ్వడం అసాధ్యం.

ఇది బేసిక్ లాజిక్. ఎందుకంటే పెద్ద తెర ఎక్స్ పీరియన్స్ కు ఏదీ సాటిరాదు. వందలాది మన చుట్టూ ఉన్నా ఏకాంతంగా ఫీలయ్యే చీకటి ప్రపంచం లాంటి హాలులో తదేకంగా ఒక సినిమా చూడటం వేరు. రిమోట్ కంట్రోల్ చేతులో పట్టుకుని ఫార్వార్డ్ చేసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, మధ్యలో పవర్ పోయినా నెట్ కట్ అయినా తిట్టుకుంటూ చూడటం వేరు. రెండింటికి పొంతన కుదరదు. అలాంటప్పుడు హనుమాన్ లాంటి విజువల్ గ్రాండియర్ ఒకే ఫీల్ ని రెండు చోట్ల ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రాన సినిమా బాలేదని సర్టిఫికెట్ ఇవ్వడం ముమ్మాటికీ తప్పే.

ప్రేక్షకులు గుడ్డిగా సినిమా చూడలేదు కదా. అపోజిషన్లో స్టార్ హీరోల మరో నాలుగు సినిమాలు ఎక్కువ స్క్రీన్లలో రిలీజైనా సరే హనుమాన్ కి బ్రహ్మరధం పట్టరు. అంతెందుకు నిన్న 66వ రోజు హైదరాబాద్ కొన్ని మల్టీప్లెక్సుల్లో సింగల్ షోలు 80 శాతం దాకా ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. కొత్త రిలీజులు మార్కెట్ లో పదిహేను దాకా ఉన్నప్పుడు రెండు నెలలు పాత సినిమా అయినా హనుమాన్ చూడటం ఎందుకు. ఇంత కన్నా వేరే ఉదాహరణ కావాలా. అయినా అవతార్, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటివి కేవలం ఇంట్లోనే చూసే బాపతు కాదు. ఖచ్చితంగా ఒక్కసారైనా థియేటర్ కెళ్ళి చూడాల్సిన బొమ్మలు.

This post was last modified on March 18, 2024 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

13 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

20 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

47 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

2 hours ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago