నితిన్ అతి పెద్ద హిట్స్ లో ఒకటి ఇష్క్. దర్శకుడు విక్రమ్ కె కుమార్ ని మెయిన్ లీగ్ లోకి తీసుకొచ్చింది ఈ సినిమానే. ఇది చూసే నాగార్జున పిలిచి మరీ మూడు తరాల అక్కినేని మూవీ మనంని ఆయన చేతుల్లో పెట్టారు. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. 2012 తర్వాత నితిన్ విక్రమ్ కాంబినేషన్ సాధ్య పడలేదు. మళ్ళీ ఈ కలయిక కార్యరూపం దాల్చనుంది. హనుమాన్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసిన నిరంజన్ రెడ్డి నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ లేవు.
కాకపోతే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. విక్రమ్ కుమార్ నాగచైతన్యతో చేసిన థాంక్ యు డిజాస్టర్ ఫలితం ఆయన్ని డిఫెన్స్ లో పడేసిన మాట వాస్తవం. కనీసం యావరేజ్ కాకపోవడం చైతు ఫ్యాన్స్ ని కలవరపరిచింది. అంతకు ముందు నాని గ్యాంగ్ లీడర్, అఖిల్ హలో ఆశించిన ఫలితాలు అందుకోలేదు. అయితే దూత వెబ్ సిరీస్ మంచి పేరు తేవడం ఊరట కలిగించింది. ఈ ట్రాక్ రికార్డుని పట్టించుకోకుండా నితిన్ మళ్ళీ ఆఫర్ ఇవ్వడం మంచి విషయమే. వరస ఫ్లాపులు ఉన్న టైంలో ఇష్క్ ద్వారా మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ గా విక్రమ్ కుమార్ మీద నమ్మకముండటం సబబే.
నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ తో తమ్ముడు చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఎక్కువ హడావిడి లేకుండా షూట్ జరుపుకుంటోంది. వేసవిలో విడుదలకు చూస్తున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ ఇంకా వేగమందుకోలేదు. ఈ రెండు పూర్తయ్యి రిలీజ్ జరుపుకునేలోగా ఈ ఏడాది పూర్తవుతుంది. అంతలోపు విక్రమ్ కుమార్ ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసేసి టైంని బట్టి సెట్స్ పైకి వెళ్తారు. అయితే ఇది ఇష్క్ 2 కాదట. పూర్తిగా వేరే జానర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆయన స్టైల్ స్క్రీన్ ప్లేతో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. చూడాలి మరి.
This post was last modified on March 18, 2024 12:46 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…