టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం చాలా డల్లుగా నడుస్తోంది. ఫిబ్రవరిలో స్లంప్ చూసిన బాక్సాఫీస్కు మార్చిలో కూడా ఆశించిన ఊపు రాలేదు. తొలి వారం డల్లుగా నడిచింది. రెండో వారం ‘గామి’, భీమా’, ‘ప్రేమలు’ కొంచెం ఊపు తెచ్చినట్లే కనిపించాయి. దీంతో వేసవి సందడి ముందే మొదలైందని అనుకున్నారు. కానీ వాటి జోరు వీకెండ్ వరకే పరిమితం అయింది.
ఇక మూడో వీకెండ్లో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. పేరుకు రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ఏవీ ప్రభావం చూపలేదు. ‘రజాకార్’ సహా అన్నీ బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయినట్లే కనిపించాయి. ముందు వారం వచ్చిన సినిమాలనే జనం ఓ మోస్తరుగా చూస్తున్నారు తప్ప.. కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు.
ఐతే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు ముగించుకుని సినిమాలకు రెడీ అయిపోతున్నారు. రెగ్యులర్ సినీ గోయర్స్ కూడా కొత్త క్రేజీ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలో ‘ఓం భీం బుష్’ లాంటి క్రేజీ మూవీ రాబోతోంది. సినిమా మంచి టైమింగ్లో రిలీజ్ కాబోతోంది. వచ్చే శుక్రవారం రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. దీని టీజర్, ట్రైలర్ యూత్కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ వారం మరి కొన్ని సినిమాలు కూడా రాబోతున్నప్పటికీ ప్రధానంగా అందరి దృష్టీ ‘ఓం భీం బుష్’ మీదే ఉండబోతోంది.
యువ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసే క్రేజీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది ‘ఓం భీం బుష్’. ప్రమోషన్లు కూడా టీం కొంచెం గట్టిగా చేస్తోంది. యువి క్రియేషన్స్ రిలీజ్ అంటే గట్టిగానే ఉంటుంది. ఈ సినిమాతోనే వేసవి సీజన్ మొదలవుతుందని భావిస్తున్నారు. తర్వాతి వారం రానున్న ‘టిల్లు స్క్వేర్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
This post was last modified on March 17, 2024 6:46 pm
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…