Movie News

అఖిల్ సరసన మరో మహేష్ హీరోయిన్?

అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఓకే అయింది. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లను బాగా డీల్ చేస్తాడని పేరున్న స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. అఖిల్ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అంతకుమించి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు గురించి ఏ వివరాలూ వెల్లడి కాలేదు. బడ్జెట్ దగ్గర్నుంచి ఈ సినిమా విషయంలో ఏ రకంగానూ రాజీ పడట్లేదని… ఓ స్టార్ హీరోయిన్నే అఖిల్‌కు జోడీగా తీసుకోవాలనుకుంటున్నారని చెప్పుకున్నారు.

ఈ క్రమంలోనే కన్నడ అమ్మాయి రష్మిక మందన్నాను ఈ చిత్రం కోసం సంప్రదించినట్లు సమాచారం. ఆమె కూడా ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ తెర వెనుక నుంచి అఖిల్ మిత్రుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. అఖిల్‌ను చరణ్ తల్లి సురేఖ రెండో కొడుకులాగా చూస్తుందని చిరంజీవి గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన సోదర సమాన స్నేహితుడి కోసం చరణ్ ఈ ప్రాజెక్టును సెట్ చేశాడంటున్నారు.

కాగా అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ మూవీలో అతడి కంటే వయసులో పెద్ద అయినా, ఇమేజ్ పరంగా కూడా పై స్థాయిలో ఉన్న పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఆమె దీని కంటే ముందు మహేష్ బాబుతో ‘మహర్షి’లో నటించింది. దాని తర్వాత మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్‌గా చేసిన రష్మికను అఖిల్ తర్వాతి సినిమాకు కథానాయికగా ఓకే చేస్తే విశేషమే అవుతుంది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఇంకొన్ని రోజుల్లోనే ఆ సినిమాను పూర్తి చేసి సురేందర్ చిత్రాన్ని అఖిల్ మొదలుపెడతాడని సమాచారం. సురేందర్ మిత్రుడు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. ఇది పూర్తయ్యాక సురేందర్ పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించనుండటం విశేషం.

This post was last modified on September 12, 2020 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

45 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago