Movie News

అఖిల్ సరసన మరో మహేష్ హీరోయిన్?

అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఓకే అయింది. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లను బాగా డీల్ చేస్తాడని పేరున్న స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. అఖిల్ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అంతకుమించి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు గురించి ఏ వివరాలూ వెల్లడి కాలేదు. బడ్జెట్ దగ్గర్నుంచి ఈ సినిమా విషయంలో ఏ రకంగానూ రాజీ పడట్లేదని… ఓ స్టార్ హీరోయిన్నే అఖిల్‌కు జోడీగా తీసుకోవాలనుకుంటున్నారని చెప్పుకున్నారు.

ఈ క్రమంలోనే కన్నడ అమ్మాయి రష్మిక మందన్నాను ఈ చిత్రం కోసం సంప్రదించినట్లు సమాచారం. ఆమె కూడా ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ తెర వెనుక నుంచి అఖిల్ మిత్రుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. అఖిల్‌ను చరణ్ తల్లి సురేఖ రెండో కొడుకులాగా చూస్తుందని చిరంజీవి గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన సోదర సమాన స్నేహితుడి కోసం చరణ్ ఈ ప్రాజెక్టును సెట్ చేశాడంటున్నారు.

కాగా అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ మూవీలో అతడి కంటే వయసులో పెద్ద అయినా, ఇమేజ్ పరంగా కూడా పై స్థాయిలో ఉన్న పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఆమె దీని కంటే ముందు మహేష్ బాబుతో ‘మహర్షి’లో నటించింది. దాని తర్వాత మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్‌గా చేసిన రష్మికను అఖిల్ తర్వాతి సినిమాకు కథానాయికగా ఓకే చేస్తే విశేషమే అవుతుంది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఇంకొన్ని రోజుల్లోనే ఆ సినిమాను పూర్తి చేసి సురేందర్ చిత్రాన్ని అఖిల్ మొదలుపెడతాడని సమాచారం. సురేందర్ మిత్రుడు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. ఇది పూర్తయ్యాక సురేందర్ పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించనుండటం విశేషం.

Satya

Recent Posts

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

8 minutes ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

13 minutes ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

3 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago